Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించిన:నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ సభ్యులు

ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించిన:నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ సభ్యులు

ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించిన:నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ సభ్యులు
January 29, 2026 09:56 PM 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండలం పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం అనంతరం పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా విద్యార్థులకు వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే స్పందించి బాధిత విద్యార్థులను నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బాధిత విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.అనంతరం జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ మాట్లాడుతూ, పాఠశాలలో ఇలాంటి దుర్ఘటన జరగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన లోపాలు, నిర్లక్ష్యం కారణమా అనే విషయాలను సంబంధిత అధికారులు పూర్తిగా విచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో ఆహార నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించాలని కోరారు.బాధిత విద్యార్థులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ తరపున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం పట్ల ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News