PRINT TIME: April 10, 2026 09:14 AM
ఫోన్లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి
ఫోన్లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి
February 05, 2026 01:03 AM
7 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామ శివారులోని మహబూబాబాద్–మరిపెడ హైవే రోడ్డుపై ఈరోజు (బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సోమ్లా తండాకు చెందిన హచ్య అనే వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా, అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో హచ్య తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఎడిజర్ల గ్రామానికి చెందిన బోడ గణేష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి