ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..
ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..
K.RAVI
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై బిఆర్ఎస్ నేతల మండిపాటు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేతల మండిపాటు..ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అడ్డుపెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై సీట్ విచారణకు వ్యతిరేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆదివారం బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీట్ విచారణను ముందుకు తీసుకెళ్తుందని విమర్శించారు.ప్రజల దృష్టిని అసలు సమస్యలనుంచి మళ్లించేందుకు ఇటువంటి చర్యలకుపాల్పడుతున్నారని అన్నారు.వెంటనే సిట్ విచారణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి