Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:37 AM

ఫిబ్రవరి 20 న తెనాలి లో జరుగు మహిళా సదస్సును విజయవంతం చేయండి! ఐఫ్వా రాష్ట్ర అద్యక్షురాలు ఆర్ నాగమణి.

ఫిబ్రవరి 20 న తెనాలి లో జరుగు మహిళా సదస్సును విజయవంతం చేయండి! ఐఫ్వా రాష్ట్ర అద్యక్షురాలు ఆర్ నాగమణి.

ఫిబ్రవరి 20 న తెనాలి లో జరుగు మహిళా సదస్సును విజయవంతం చేయండి! ఐఫ్వా రాష్ట్ర అద్యక్షురాలు ఆర్ నాగమణి.
13-02-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఉమ్మడికృష్ణా జిల్లాకమిటీ సమావేశం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో "ఐప్వా" మండల అధ్యక్షురాలు బంటు పూజిత అధ్యక్షతన జరిగింది. ముందుగా ఐఫ్వా జెండా ఆవిష్కరణ చేసారు.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న "ఐప్వా" రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఆర్. నాగమణి మాట్లా డుతూదేశంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి అధికారం చేపట్టిన దగ్గర నుంచి దేశంలో మహిళలపై దాడులు తీవ్రస్థాయిలో పెరిగాయని, మహిళలపై దాడులు, హత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని, చేసిన దోషులను కఠినంగా శిక్షించడానికి బదులు వారికి అండగా నిలబడుతూ వారిని పూలదండలతో సన్మానించడం ఆర్ఎస్ఎస్ – మోడీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం మహిళలను మనువాద దృక్పథంతో చూస్తూ కించపరిచే చర్యలు చేపడుతుందని ఆరోపించారు. మోడీ విధానాలనే రాష్ట్రంలో తూచతప్పకుండా అనుసరిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం మహిళా వ్యతిరేక చర్యలను విమర్శించారు. ప్రతి నెల మహిళలకు ఇస్తారన్న 1500 రూపాయలు హామీ, నిరుద్యోగాన్ని నిర్మూలి స్తానన్న హామీలను ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసారని ఆరోపించారు. ఈ చర్యలను మహిళలు ముక్త కంఠంతోవ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తక్షణం మహిళా రక్షణ చట్టాలను అమలు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న మతతత్వ, మనువాద, మహిళా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20వ తేదీన "ఐప్వా" ఆధ్వర్యంలో తెనాలిలో "రాష్ట్ర సదస్సు" జరుగుతుందని ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా "ఐప్వా" జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మీనా తివారి హాజరవుతున్నారని ఈ సదస్సులో అన్ని వర్గాల మహిళలు పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు, అలాగే మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సమాన పనికి – సమా న వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో మహిళ లకు రక్షణ చట్టాలు అమలు చేయాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారం, హత్యలు చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, వాటిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకులు బంటు పూజిత, పరికళ కళావతి, బొలమాల సీతామహలక్ష్మి, నందిపాము భవాని, విజయమ్మ, సిహెచ్ చిలకమ్మా, దుర్గం అమల, మెర్శిమ్మ, వేముల మహలక్ష్మి, అనసూరి, లక్ష్మీ, ఇరటా సూర్యకుమారి, మానుకొండ లోవమ్మ, బోడపాటి నాగమణి, నక్క మంగమ్మ, కన్నాటి లక్ష్మి, ఏ.నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫిబ్రవరి 20 న తెనాలి లో జరుగు మహిళా సదస్సును విజయవంతం చేయండి! ఐఫ్వా రాష్ట్ర అద్యక్షురాలు ఆర్ నాగమణి.

Article Image

అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఉమ్మడికృష్ణా జిల్లాకమిటీ సమావేశం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో "ఐప్వా" మండల అధ్యక్షురాలు బంటు పూజిత అధ్యక్షతన జరిగింది. ముందుగా ఐఫ్వా జెండా ఆవిష్కరణ చేసారు.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న "ఐప్వా" రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఆర్. నాగమణి మాట్లా డుతూదేశంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి అధికారం చేపట్టిన దగ్గర నుంచి దేశంలో మహిళలపై దాడులు తీవ్రస్థాయిలో పెరిగాయని, మహిళలపై దాడులు, హత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని, చేసిన దోషులను కఠినంగా శిక్షించడానికి బదులు వారికి అండగా నిలబడుతూ వారిని పూలదండలతో సన్మానించడం ఆర్ఎస్ఎస్ – మోడీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం మహిళలను మనువాద దృక్పథంతో చూస్తూ కించపరిచే చర్యలు చేపడుతుందని ఆరోపించారు. మోడీ విధానాలనే రాష్ట్రంలో తూచతప్పకుండా అనుసరిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం మహిళా వ్యతిరేక చర్యలను విమర్శించారు. ప్రతి నెల మహిళలకు ఇస్తారన్న 1500 రూపాయలు హామీ, నిరుద్యోగాన్ని నిర్మూలి స్తానన్న హామీలను ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసారని ఆరోపించారు. ఈ చర్యలను మహిళలు ముక్త కంఠంతోవ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తక్షణం మహిళా రక్షణ చట్టాలను అమలు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న మతతత్వ, మనువాద, మహిళా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20వ తేదీన "ఐప్వా" ఆధ్వర్యంలో తెనాలిలో "రాష్ట్ర సదస్సు" జరుగుతుందని ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా "ఐప్వా" జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మీనా తివారి హాజరవుతున్నారని ఈ సదస్సులో అన్ని వర్గాల మహిళలు పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు, అలాగే మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సమాన పనికి – సమా న వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో మహిళ లకు రక్షణ చట్టాలు అమలు చేయాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారం, హత్యలు చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, వాటిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకులు బంటు పూజిత, పరికళ కళావతి, బొలమాల సీతామహలక్ష్మి, నందిపాము భవాని, విజయమ్మ, సిహెచ్ చిలకమ్మా, దుర్గం అమల, మెర్శిమ్మ, వేముల మహలక్ష్మి, అనసూరి, లక్ష్మీ, ఇరటా సూర్యకుమారి, మానుకొండ లోవమ్మ, బోడపాటి నాగమణి, నక్క మంగమ్మ, కన్నాటి లక్ష్మి, ఏ.నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News