Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:24 PM

ఫిబ్రవరి 20 న తెనాలి లో జరుగు మహిళా సదస్సును విజయవంతం చేయండి! ఐఫ్వా రాష్ట్ర అద్యక్షురాలు ఆర్ నాగమణి.

ఫిబ్రవరి 20 న తెనాలి లో జరుగు మహిళా సదస్సును విజయవంతం చేయండి! ఐఫ్వా రాష్ట్ర అద్యక్షురాలు ఆర్ నాగమణి.

ఫిబ్రవరి 20 న తెనాలి లో జరుగు మహిళా సదస్సును విజయవంతం చేయండి! ఐఫ్వా రాష్ట్ర అద్యక్షురాలు ఆర్ నాగమణి.
February 13, 2026 06:37 PM 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఉమ్మడికృష్ణా జిల్లాకమిటీ సమావేశం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో "ఐప్వా" మండల అధ్యక్షురాలు బంటు పూజిత అధ్యక్షతన జరిగింది. ముందుగా ఐఫ్వా జెండా ఆవిష్కరణ చేసారు.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న "ఐప్వా" రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఆర్. నాగమణి మాట్లా డుతూదేశంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి అధికారం చేపట్టిన దగ్గర నుంచి దేశంలో మహిళలపై దాడులు తీవ్రస్థాయిలో పెరిగాయని, మహిళలపై దాడులు, హత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని, చేసిన దోషులను కఠినంగా శిక్షించడానికి బదులు వారికి అండగా నిలబడుతూ వారిని పూలదండలతో సన్మానించడం ఆర్ఎస్ఎస్ – మోడీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం మహిళలను మనువాద దృక్పథంతో చూస్తూ కించపరిచే చర్యలు చేపడుతుందని ఆరోపించారు. మోడీ విధానాలనే రాష్ట్రంలో తూచతప్పకుండా అనుసరిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం మహిళా వ్యతిరేక చర్యలను విమర్శించారు. ప్రతి నెల మహిళలకు ఇస్తారన్న 1500 రూపాయలు హామీ, నిరుద్యోగాన్ని నిర్మూలి స్తానన్న హామీలను ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసారని ఆరోపించారు. ఈ చర్యలను మహిళలు ముక్త కంఠంతోవ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తక్షణం మహిళా రక్షణ చట్టాలను అమలు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న మతతత్వ, మనువాద, మహిళా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20వ తేదీన "ఐప్వా" ఆధ్వర్యంలో తెనాలిలో "రాష్ట్ర సదస్సు" జరుగుతుందని ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా "ఐప్వా" జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మీనా తివారి హాజరవుతున్నారని ఈ సదస్సులో అన్ని వర్గాల మహిళలు పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు, అలాగే మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సమాన పనికి – సమా న వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో మహిళ లకు రక్షణ చట్టాలు అమలు చేయాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారం, హత్యలు చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, వాటిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకులు బంటు పూజిత, పరికళ కళావతి, బొలమాల సీతామహలక్ష్మి, నందిపాము భవాని, విజయమ్మ, సిహెచ్ చిలకమ్మా, దుర్గం అమల, మెర్శిమ్మ, వేముల మహలక్ష్మి, అనసూరి, లక్ష్మీ, ఇరటా సూర్యకుమారి, మానుకొండ లోవమ్మ, బోడపాటి నాగమణి, నక్క మంగమ్మ, కన్నాటి లక్ష్మి, ఏ.నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News