ఫిబ్రవరి 12న జరిగే అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు
ఫిబ్రవరి 12న జరిగే అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు
GADDAM JAGANMOHAN REDDY
కార్మికులు పోరాటాలతో సాధించుకున్న29 కార్మిక చట్టాలను కుదించి కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లుగా అమలు చేయడానికి పూను కొందని కార్మికు లకు నష్టం కలిగించే 4 కోడ్ల ను కార్మికులు తిరస్క రించాలని ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాల ని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు పిలుపు నిచ్చారు. శనివారం మండల కేంద్రమైన చాట్రాయిలో కార్మికులతో కలిసి కరపత్రాలు విడుదల చేసి పంచిపెట్టారు. సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలోఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక ప్రభుత్వాలని, పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయా లు చేస్తున్నారని వెంటనే కేంద్రం తెచ్చిన 4 కోడ్లను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశా రు. మోడీప్రభుత్వం 4 కార్మిక కోడ్ లను అమలు చేయడానికి సిద్ధమైందని నవంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసి అమలు చేయడానికి అవసరమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తుందని ఆయన తెలిపారు. కోడ్లు వల్ల కార్మికులకు మంచి జరుగుతుందని ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా చేస్తోందని ఆయన విమర్శించారు. కార్మికులు పోరాడి సాదించుకున్న 29 చట్టాలను రద్దుచేసి కేంద్రం తెచ్చిన ఈ 4 కోడ్ లు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలలో మహిళా కార్మికులు పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనం ఇవ్వడం లేదని, మహిళలతో ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయించు కుంటున్నా యని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్కీం వర్కర్లనందరినీ ఆశా, అంగనవాడి మిడ్ డే మిల్, పాఠశాల పారిశుధ్య కార్మికులు, డ్వాక్రాలో వీఎఓలు, ఉపాధి హామీ పథకం యానిమేటర్లు, ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 36 వేలరూపాయలు ఇవ్వాలని, ఆయన డిమాండ్ చేశారు. 2005లో అప్పటి ప్రభుత్వం అమలు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చడాన్ని పుల్లారావు తీవ్రంగా ఖండించారు. విబి రాంజీ మిషన్ పేరును మార్చడం వల్ల ఉప యోగం ఏమిటని ప్రశ్నించారు. పాత పేరుని కొనసాగించాలని పుల్లారావు డిమాండ్ చేశారు. గతంలో ఉన్న పథకం వల్ల కార్మికులు పని కావాలని అడిగే పరిస్థితి ఉండేదని, మోడీ తీసుకొచ్చినటువంటి చట్టం వల్ల ఆ హక్కును కోల్పోతామని, పని ఇచ్చినప్పుడు మాత్రమే కార్మికులు చేయాలని తెలిపారు. ఉపాధిహామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, మండల కార్యదర్శ కలపాల వెంకటేశ్వరావు, నడ్డి దేవమాత, బి, ఆనదరావు, సీతామహలక్ష్మి, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నా రు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి