ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మె.. కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటం: దండెంపల్లి సత్తయ్య పిలుపు
ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మె.. కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటం: దండెంపల్లి సత్తయ్య పిలుపు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మె.. కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటం: దండెంపల్లి సత్తయ్య పిలుపు
కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు.గురువారం సమ్మె ప్రచార కార్యక్రమంలో భాగంగా నెహ్రూగంజి పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని విభజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన విత్తన విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఫిబ్రవరి 12 సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, నలగొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలి యూనియన్ అధ్యక్షులు ఆవురేష్ మారయ్య, కార్యదర్శి బొమ్మకంటి లక్ష్మీపతి, కమిటీ సభ్యులు జగదీష్, దూదిమెట్ల వెంకన్న, అంజయ్య, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి