Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:25 AM

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి
January 31, 2026 07:36 PM 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 31( స్ధానికం న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడం తో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది అని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు.

చాట్రాయి మండలం, చనుబండ శివారు సూరంపాలెం దళితవాడలో, చనుబండ బీసీ కాలనీలో టీడీపీ నాయకులు మోరంపూడి శ్రీనివాస రావు, పరసా శ్రీనివాస రావు, నక్కా రాము, గవర వెంకటేశ్వర రావు, గుడిమళ్ళ బ్రహ్మయ్య లు పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. చనుబండ బీసీ కాలనీలో వనమా సత్యనారాయణ కు వృద్ధాప్య పింఛను నాలుగు వేలు, అతని భార్య వనమా లక్ష్మీ కి దివ్యాంగ పింఛన్ ఆరు వేలు వస్తోంది కాగా మూడు నెలల పాటు ఆ భార్యాభర్తలిద్దరూ ఆపరేషన్ చేయించుకుని వైద్యం కోసం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు సదరు భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి మూడు నెలల పెన్షన్ రూ:30 వేలు నగదు అందజేయగా వారి ఆనందానికి అవధులు లేవని మోరంపూడి పేర్కొన్నారు. ఈ మంచి కూటమి ప్రభుత్వం మళ్ళీ,మళ్లీ అధికారంలోకి రావాలని పెన్షనర్లు, ప్రజలు కోరుకుంటున్నారని మోరంపూడి అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News