ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి
ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 31( స్ధానికం న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడం తో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది అని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు.
చాట్రాయి మండలం, చనుబండ శివారు సూరంపాలెం దళితవాడలో, చనుబండ బీసీ కాలనీలో టీడీపీ నాయకులు మోరంపూడి శ్రీనివాస రావు, పరసా శ్రీనివాస రావు, నక్కా రాము, గవర వెంకటేశ్వర రావు, గుడిమళ్ళ బ్రహ్మయ్య లు పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. చనుబండ బీసీ కాలనీలో వనమా సత్యనారాయణ కు వృద్ధాప్య పింఛను నాలుగు వేలు, అతని భార్య వనమా లక్ష్మీ కి దివ్యాంగ పింఛన్ ఆరు వేలు వస్తోంది కాగా మూడు నెలల పాటు ఆ భార్యాభర్తలిద్దరూ ఆపరేషన్ చేయించుకుని వైద్యం కోసం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు సదరు భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి మూడు నెలల పెన్షన్ రూ:30 వేలు నగదు అందజేయగా వారి ఆనందానికి అవధులు లేవని మోరంపూడి పేర్కొన్నారు. ఈ మంచి కూటమి ప్రభుత్వం మళ్ళీ,మళ్లీ అధికారంలోకి రావాలని పెన్షనర్లు, ప్రజలు కోరుకుంటున్నారని మోరంపూడి అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి