Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు
16-03-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి పెండింగ్ జీతాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు దీర్ఘకాలంగా విడుదల కాకపోవడంతో జిల్లాలోని అనేక ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు ఐదు నెలలకుపైగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కుటుంబ ఖర్చులు, వైద్య ఖర్చులు, పిల్లల విద్యా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు వంటి దినసరి ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి నెలకొన్నదని, కొంతమందిని ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేస్తూ ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల వైద్య సేవలు కూడా వాయిదా పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే 2026 ఏప్రిల్ 1 నుంచి తరగతులు బోధించడం నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్ చారి, విజయ్ చందర్, భాషిపంగు సునిల్ కుమార్, గంజికుంట్ల గోపినాథ్ (టీఎల్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి), ఇటీకాల రోజుబాబు, విజయ్ కుమార్, సాయి కుమార్, రవి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు

Article Image

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి పెండింగ్ జీతాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు దీర్ఘకాలంగా విడుదల కాకపోవడంతో జిల్లాలోని అనేక ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు ఐదు నెలలకుపైగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కుటుంబ ఖర్చులు, వైద్య ఖర్చులు, పిల్లల విద్యా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు వంటి దినసరి ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి నెలకొన్నదని, కొంతమందిని ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేస్తూ ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల వైద్య సేవలు కూడా వాయిదా పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే 2026 ఏప్రిల్ 1 నుంచి తరగతులు బోధించడం నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్ చారి, విజయ్ చందర్, భాషిపంగు సునిల్ కుమార్, గంజికుంట్ల గోపినాథ్ (టీఎల్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి), ఇటీకాల రోజుబాబు, విజయ్ కుమార్, సాయి కుమార్, రవి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News