Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:16 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు
March 16, 2026 06:22 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి పెండింగ్ జీతాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు దీర్ఘకాలంగా విడుదల కాకపోవడంతో జిల్లాలోని అనేక ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు ఐదు నెలలకుపైగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కుటుంబ ఖర్చులు, వైద్య ఖర్చులు, పిల్లల విద్యా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు వంటి దినసరి ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి నెలకొన్నదని, కొంతమందిని ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేస్తూ ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల వైద్య సేవలు కూడా వాయిదా పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే 2026 ఏప్రిల్ 1 నుంచి తరగతులు బోధించడం నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్ చారి, విజయ్ చందర్, భాషిపంగు సునిల్ కుమార్, గంజికుంట్ల గోపినాథ్ (టీఎల్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి), ఇటీకాల రోజుబాబు, విజయ్ కుమార్, సాయి కుమార్, రవి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News