Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:59 AM

ఫుడ్ ఫెస్ట్‌లో విద్యార్థుల సృజనాత్మకతను అభినందించిన:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

ఫుడ్ ఫెస్ట్‌లో విద్యార్థుల సృజనాత్మకతను అభినందించిన:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

ఫుడ్ ఫెస్ట్‌లో విద్యార్థుల సృజనాత్మకతను అభినందించిన:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి
08-01-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:మనూర్ మండలం మైయికోడ్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి పాల్గొని, విద్యార్థులు స్వయంగా తయారు చేసి తీసుకువచ్చిన వివిధ రకాల వంటకాలను ఆసక్తిగా పరిశీలించారు.విద్యార్థుల సృజనాత్మకతను, వంటలలో చూపిన నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ వారిని అభినందించారు.ఫుడ్ ఫెస్ట్ ద్వారా విద్యార్థుల్లో పోషకాహారం పై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆత్మవిశ్వాసం మరియు నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

ఫుడ్ ఫెస్ట్‌లో విద్యార్థుల సృజనాత్మకతను అభినందించిన:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:మనూర్ మండలం మైయికోడ్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి పాల్గొని, విద్యార్థులు స్వయంగా తయారు చేసి తీసుకువచ్చిన వివిధ రకాల వంటకాలను ఆసక్తిగా పరిశీలించారు.విద్యార్థుల సృజనాత్మకతను, వంటలలో చూపిన నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ వారిని అభినందించారు.ఫుడ్ ఫెస్ట్ ద్వారా విద్యార్థుల్లో పోషకాహారం పై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆత్మవిశ్వాసం మరియు నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News