ఫుడ్ ఫెస్ట్లో విద్యార్థుల సృజనాత్మకతను అభినందించిన:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి
ఫుడ్ ఫెస్ట్లో విద్యార్థుల సృజనాత్మకతను అభినందించిన:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:మనూర్ మండలం మైయికోడ్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి పాల్గొని, విద్యార్థులు స్వయంగా తయారు చేసి తీసుకువచ్చిన వివిధ రకాల వంటకాలను ఆసక్తిగా పరిశీలించారు.విద్యార్థుల సృజనాత్మకతను, వంటలలో చూపిన నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ వారిని అభినందించారు.ఫుడ్ ఫెస్ట్ ద్వారా విద్యార్థుల్లో పోషకాహారం పై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆత్మవిశ్వాసం మరియు నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి