Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:32 PM

ఫుడ్ పాయిజన్ కలవరం: 60 మంది పిల్లలకు ఒంట్లో బాగైతలేదు!

ఫుడ్ పాయిజన్ కలవరం: 60 మంది పిల్లలకు ఒంట్లో బాగైతలేదు!

ఫుడ్ పాయిజన్ కలవరం: 60 మంది పిల్లలకు ఒంట్లో బాగైతలేదు!
December 14, 2025 06:07 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
మాదాపూర్ (చంద్రనాయక్ తండా), బాగ్ లింగంపల్లి, హైదరాబాద్.
ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలల్ల కలుషితమైన ఫుడ్ తిని పిల్లలు ఆసుపత్రి పాలైర్రు.

హైదరాబాద్ సిటీల ఫుడ్ పాయిజన్ మళ్లా కలవరం పుట్టిచ్చింది. ఒక్క రోజు తేడాలనే రెండు ప్రభుత్వ స్కూళ్లు, మైనారిటీ గురుకులాలల్ల సుమారు 60 మందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురైర్రు.

మాదాపూర్ స్కూల్: 44 మందికి అస్వస్థత మాదాపూర్లని చంద్రనాయక్ తండా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ల మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 44 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, విరేచనాలతొటి ఇబ్బంది పడిర్రు.

  1. వాళ్లని కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌కు పట్టుకపాయ్ర్రు.
  2. ఆరుగురు పిల్లల పరిస్థితి కొద్దిగా సీరియస్‌గ ఉండడంతో వాళ్ళని నానక్‌రాంగూడలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు పంపిచ్చిర్రు.
  3. అయినా, ఇప్పుడు అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పిర్రు.

బాగ్ లింగంపల్లి గురుకులం: 16 మందికి జబ్బు ఇంకొక ఘటనల, బాగ్ లింగంపల్లిలని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌ల కూడా గురువారం రాత్రి, శుక్రవారం పొద్దున తిన్న ఫుడ్ వికటించి 16 మంది పిల్లలు అస్వస్థతకు గురైర్రు.

  1. వీళ్ళని కింగ్ కోఠి హాస్పిటల్‌ల చేర్చిర్రు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉందని డాక్టర్లు చెప్పిర్రు.
తొందర్ల విచారణకు ఆదేశం రెండు స్కూళ్లల కలుషితమైన ఆహారం లేదా నీళ్లు తాగడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుమానిస్తున్నరు. ఆఫీసర్లు ఫుడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టింగ్‌కు పంపిచ్చిర్రు. ఈ ఘటనల మీద విచారణకు ఆదేశించి, తప్పు చేసిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటమని అధికారులు చెప్పిర్రు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News