Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:28 AM

ఫుడ్ పాయిజన్ కలవరం: 60 మంది పిల్లలకు ఒంట్లో బాగైతలేదు!

ఫుడ్ పాయిజన్ కలవరం: 60 మంది పిల్లలకు ఒంట్లో బాగైతలేదు!

ఫుడ్ పాయిజన్ కలవరం: 60 మంది పిల్లలకు ఒంట్లో బాగైతలేదు!
14-12-2025 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మాదాపూర్ (చంద్రనాయక్ తండా), బాగ్ లింగంపల్లి, హైదరాబాద్.
ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలల్ల కలుషితమైన ఫుడ్ తిని పిల్లలు ఆసుపత్రి పాలైర్రు.

హైదరాబాద్ సిటీల ఫుడ్ పాయిజన్ మళ్లా కలవరం పుట్టిచ్చింది. ఒక్క రోజు తేడాలనే రెండు ప్రభుత్వ స్కూళ్లు, మైనారిటీ గురుకులాలల్ల సుమారు 60 మందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురైర్రు.

మాదాపూర్ స్కూల్: 44 మందికి అస్వస్థత మాదాపూర్లని చంద్రనాయక్ తండా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ల మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 44 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, విరేచనాలతొటి ఇబ్బంది పడిర్రు.

  1. వాళ్లని కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌కు పట్టుకపాయ్ర్రు.
  2. ఆరుగురు పిల్లల పరిస్థితి కొద్దిగా సీరియస్‌గ ఉండడంతో వాళ్ళని నానక్‌రాంగూడలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు పంపిచ్చిర్రు.
  3. అయినా, ఇప్పుడు అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పిర్రు.

బాగ్ లింగంపల్లి గురుకులం: 16 మందికి జబ్బు ఇంకొక ఘటనల, బాగ్ లింగంపల్లిలని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌ల కూడా గురువారం రాత్రి, శుక్రవారం పొద్దున తిన్న ఫుడ్ వికటించి 16 మంది పిల్లలు అస్వస్థతకు గురైర్రు.

  1. వీళ్ళని కింగ్ కోఠి హాస్పిటల్‌ల చేర్చిర్రు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉందని డాక్టర్లు చెప్పిర్రు.
తొందర్ల విచారణకు ఆదేశం రెండు స్కూళ్లల కలుషితమైన ఆహారం లేదా నీళ్లు తాగడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుమానిస్తున్నరు. ఆఫీసర్లు ఫుడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టింగ్‌కు పంపిచ్చిర్రు. ఈ ఘటనల మీద విచారణకు ఆదేశించి, తప్పు చేసిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటమని అధికారులు చెప్పిర్రు.
Sthanikam

ఫుడ్ పాయిజన్ కలవరం: 60 మంది పిల్లలకు ఒంట్లో బాగైతలేదు!

Article Image
మాదాపూర్ (చంద్రనాయక్ తండా), బాగ్ లింగంపల్లి, హైదరాబాద్.
ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలల్ల కలుషితమైన ఫుడ్ తిని పిల్లలు ఆసుపత్రి పాలైర్రు.

హైదరాబాద్ సిటీల ఫుడ్ పాయిజన్ మళ్లా కలవరం పుట్టిచ్చింది. ఒక్క రోజు తేడాలనే రెండు ప్రభుత్వ స్కూళ్లు, మైనారిటీ గురుకులాలల్ల సుమారు 60 మందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురైర్రు.

మాదాపూర్ స్కూల్: 44 మందికి అస్వస్థత మాదాపూర్లని చంద్రనాయక్ తండా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ల మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 44 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, విరేచనాలతొటి ఇబ్బంది పడిర్రు.

  1. వాళ్లని కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌కు పట్టుకపాయ్ర్రు.
  2. ఆరుగురు పిల్లల పరిస్థితి కొద్దిగా సీరియస్‌గ ఉండడంతో వాళ్ళని నానక్‌రాంగూడలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు పంపిచ్చిర్రు.
  3. అయినా, ఇప్పుడు అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పిర్రు.

బాగ్ లింగంపల్లి గురుకులం: 16 మందికి జబ్బు ఇంకొక ఘటనల, బాగ్ లింగంపల్లిలని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌ల కూడా గురువారం రాత్రి, శుక్రవారం పొద్దున తిన్న ఫుడ్ వికటించి 16 మంది పిల్లలు అస్వస్థతకు గురైర్రు.

  1. వీళ్ళని కింగ్ కోఠి హాస్పిటల్‌ల చేర్చిర్రు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉందని డాక్టర్లు చెప్పిర్రు.
తొందర్ల విచారణకు ఆదేశం రెండు స్కూళ్లల కలుషితమైన ఆహారం లేదా నీళ్లు తాగడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుమానిస్తున్నరు. ఆఫీసర్లు ఫుడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టింగ్‌కు పంపిచ్చిర్రు. ఈ ఘటనల మీద విచారణకు ఆదేశించి, తప్పు చేసిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటమని అధికారులు చెప్పిర్రు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News