ఫోటో లేకపోయిందన్న ఆగ్రహంతో పెక్సీలు చింపిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు
ఫోటో లేకపోయిందన్న ఆగ్రహంతో పెక్సీలు చింపిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు
స్థానికం బృందం
ఫ్లెక్సీ వార్: నిదానపల్లిలో గెలిచినా మొదలైన కాంగ్రెస్ కుమ్ములాటలు!
రామన్నపేట (నిదానపల్లి):
రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల విజయోత్సవంలో ఉండాల్సిన పార్టీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
అసలేం జరిగిందంటే?
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నారపాక మాధవి యాదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె నూతన సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, గ్రామంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ శేఖర్ గౌడ్ ఫోటో లేకపోవడంతో వివాదం మొదలైంది.
బహిరంగంగానే ఆగ్రహం.. ఫ్లెక్సీల చింపివేత!
తమ పార్టీ గ్రామ అధ్యక్షుడి ఫోటో లేకపోవడాన్ని అవమానంగా భావించిన శేఖర్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ శ్రేణుల సమక్షంలోనే ఫ్లెక్సీలను చింపివేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు విజయోత్సవ వేళ సంతోషంగా ఉండాల్సిన సమయంలో, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నిర్లక్ష్యమా? ఉద్దేశపూర్వకమా?
ఫ్లెక్సీల తయారీలో జరిగిన పొరపాటు నిర్వాహకుల నిర్లక్ష్యమా? లేక కావాలనే గ్రామ అధ్యక్షుడిని పక్కన పెట్టాలని చేసిన ప్రయత్నమా? అనే చర్చ ఇప్పుడు నిదానపల్లిలో జోరుగా సాగుతోంది. గ్రామ స్థాయి విజయాన్ని సంబరంగా జరుపుకోవాల్సిన తరుణంలో ఈ విభేదాలు బయటపడటం కాంగ్రెస్ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి