Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:58 AM

పెట్రోల్, డీజిల్, గ్యాస్ సమృద్ధిగా ఉన్నాయి: అడిషనల్ కలెక్టర్

పెట్రోల్, డీజిల్, గ్యాస్ సమృద్ధిగా ఉన్నాయి: అడిషనల్ కలెక్టర్

పెట్రోల్, డీజిల్, గ్యాస్ సమృద్ధిగా ఉన్నాయి: అడిషనల్ కలెక్టర్
March 26, 2026 08:23 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటగ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని అడిషనల్ కలెక్టర్ మాధురి స్పష్టం చేశారు.గురువారం కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంధన నిల్వల పరిస్థితిని పరిశీలించిన ఆమె, ప్రస్తుతం జిల్లాలో అవసరానికి తగినంత నిల్వలు ఉన్నాయని, పెట్రోల్ బంకులు మరియు గ్యాస్ ఏజెన్సీలకు సరఫరాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవల కొన్ని బంకుల వద్ద కనిపిస్తున్న క్యూల కారణంగా కొరత ఉందనే వదంతులు వ్యాపిస్తున్నాయని,అయితే ప్రజలు అవసరానికి మించి ముందస్తుగా నిల్వ చేసుకోవడం వల్లే డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని చెప్పారు.సాధారణంగా రోజుకు సుమారు 10 వేల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్స్ ఉండగా,వదంతుల ప్రభావంతో అది 16 వేల వరకు పెరిగిందని, అయినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్‌ను కంటైనర్లు లేదా డబ్బాల్లో నిల్వ చేయడం చట్టవ్యతిరేకమే కాకుండా ప్రమాదకరమని హెచ్చరించారు.గ్యాస్ ఏజెన్సీలు, డీలర్ల కార్యకలాపాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎం సివిల్ సప్లై అంబదాస్, ఏఎస్‌వో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News