పెట్రోల్, డీజిల్, గ్యాస్ సమృద్ధిగా ఉన్నాయి: అడిషనల్ కలెక్టర్
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సమృద్ధిగా ఉన్నాయి: అడిషనల్ కలెక్టర్
Krishna
జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటగ్యాస్కు ఎలాంటి కొరత లేదని అడిషనల్ కలెక్టర్ మాధురి స్పష్టం చేశారు.గురువారం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంధన నిల్వల పరిస్థితిని పరిశీలించిన ఆమె, ప్రస్తుతం జిల్లాలో అవసరానికి తగినంత నిల్వలు ఉన్నాయని, పెట్రోల్ బంకులు మరియు గ్యాస్ ఏజెన్సీలకు సరఫరాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవల కొన్ని బంకుల వద్ద కనిపిస్తున్న క్యూల కారణంగా కొరత ఉందనే వదంతులు వ్యాపిస్తున్నాయని,అయితే ప్రజలు అవసరానికి మించి ముందస్తుగా నిల్వ చేసుకోవడం వల్లే డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని చెప్పారు.సాధారణంగా రోజుకు సుమారు 10 వేల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ ఉండగా,వదంతుల ప్రభావంతో అది 16 వేల వరకు పెరిగిందని, అయినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ను కంటైనర్లు లేదా డబ్బాల్లో నిల్వ చేయడం చట్టవ్యతిరేకమే కాకుండా ప్రమాదకరమని హెచ్చరించారు.గ్యాస్ ఏజెన్సీలు, డీలర్ల కార్యకలాపాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎం సివిల్ సప్లై అంబదాస్, ఏఎస్వో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి