పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఎం నిరసన
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఎం నిరసన
K.RAVI
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెను భారం మోపుతోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మండిపడ్డారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ బస్టాండ్ ఎదుట పెట్రోల్ బంక్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, గంగాదేవి సైదులు, గోశిక కరుణాకర్ మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను మోసం చేసిందన్నారు. ఇంధన ధరల పెరుగుదలతో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ ఇంధన ధరలను పెంచడం ప్రజల నడ్డి విరిచే చర్య అని విమర్శించారు. ఎన్నికల ముందు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే రూ.3కు పైగా పెంచడం ప్రజల విశ్వాసాన్ని ద్రోహంచేయడమేనన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, కొండే శ్రీశైలం, బోయి యాదయ్య, తోర్పునూరి మల్లేశం, కందగట్ల ఆనంద్, భావనలపల్లి స్వామి, యాట బాలరాజు, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎండీ రహీం, మానే శాలయ్య, భీమగొని బాలరాజు, యాట ముత్యాలు, వల్లూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి