Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:54 AM

పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా ఉగ్గే రాజేష్

పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా ఉగ్గే రాజేష్

పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా ఉగ్గే రాజేష్
19-05-2026 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణ పెరిక కుల సంఘం ఎన్నికలు ఆదివారం ఘనంగా నిర్వహించగా, సంఘ సభ్యుల ఏకాభిప్రాయంతో ఉగ్గే రాజేష్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బుర్రి రవీందర్, గౌరవాధ్యక్షుడిగా గరిక సత్యనారాయణ, కోశాధికారిగా కానుగంటి మునిశ్వర్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరినీ ఎన్నుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం అధ్యక్షుడు తిప్పని పరమేష్, కార్యదర్శి కోట సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఉగ్గే రాజేష్ మాట్లాడుతూ… కుల బంధువుల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మంచి–చెడు కార్యక్రమాల్లో కార్యవర్గంతో కలిసి ముందుండి సేవలు అందిస్తామని తెలిపారు. కుల ఐక్యత బలోపేతానికి కృషి చేస్తామని, త్వరలోనే కుల భవన నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా సంఘం తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారు కొమిరిశెట్టి నరసింహులు, కోశాధికారి దాచేపల్లి రాజు, రాజాపేట ప్రధాన కార్యదర్శి అంకతి బిక్షపతి, ఎన్నారం అధ్యక్షుడు మద్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా ఉగ్గే రాజేష్

Article Image

రామన్నపేట పట్టణ పెరిక కుల సంఘం ఎన్నికలు ఆదివారం ఘనంగా నిర్వహించగా, సంఘ సభ్యుల ఏకాభిప్రాయంతో ఉగ్గే రాజేష్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బుర్రి రవీందర్, గౌరవాధ్యక్షుడిగా గరిక సత్యనారాయణ, కోశాధికారిగా కానుగంటి మునిశ్వర్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరినీ ఎన్నుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం అధ్యక్షుడు తిప్పని పరమేష్, కార్యదర్శి కోట సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఉగ్గే రాజేష్ మాట్లాడుతూ… కుల బంధువుల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మంచి–చెడు కార్యక్రమాల్లో కార్యవర్గంతో కలిసి ముందుండి సేవలు అందిస్తామని తెలిపారు. కుల ఐక్యత బలోపేతానికి కృషి చేస్తామని, త్వరలోనే కుల భవన నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా సంఘం తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారు కొమిరిశెట్టి నరసింహులు, కోశాధికారి దాచేపల్లి రాజు, రాజాపేట ప్రధాన కార్యదర్శి అంకతి బిక్షపతి, ఎన్నారం అధ్యక్షుడు మద్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News