PRINT TIME: July 04, 2026 01:48 AM
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్పై రూ.3 పెంపు.. తక్షణమే అమలు
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్పై రూ.3 పెంపు.. తక్షణమే అమలు
May 15, 2026 08:35 AM
44 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్కు సుమారు రూ.3 వరకు పెంచాయి. కొత్త ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఆయిల్ కంపెనీలపై ఆర్థిక భారం పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.97.77కు, డీజిల్ ధర రూ.90.67కు చేరింది. ముంబై, కోల్కతా, చెన్నై వంటి నగరాల్లో కూడా ధరలు పెరిగాయి. ఈ పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి, సాధారణ ప్రజలపై మరింత భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి