Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:08 AM

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఏఐటీయూసీ ఆగ్రహం. ధరలు తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఏఐటీయూసీ ఆగ్రహం. ధరలు తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఏఐటీయూసీ ఆగ్రహం. ధరలు తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
May 18, 2026 06:26 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం చందన బ్రదర్స్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వైటీ భీమరాజు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ సీనియర్‌ నాయకుడు కె.అజయ్‌బాబు, రాష్ట్ర సమితి సభ్యుడు ఓబి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచుతున్న ఇంధన ధరలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులు, దినసరి కూలీలు, మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల భారం మరింత పెరిగిందన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, పప్పుదినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఉపశమనం కల్పించకుండా ప్రభుత్వాలు పన్నుల రూపంలో భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు.

పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, చమురుపై విధిస్తున్న ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు బి.ఎంకన్న, కల్లుబావి రాజు, ఈరన్న, రాజేష్‌, దేవా, నరసింహులు, వీరేష్‌తో పాటు హమాలి, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News