Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:58 AM

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఏఐటీయూసీ ఆగ్రహం. ధరలు తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఏఐటీయూసీ ఆగ్రహం. ధరలు తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఏఐటీయూసీ ఆగ్రహం. ధరలు తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
18-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం చందన బ్రదర్స్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వైటీ భీమరాజు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ సీనియర్‌ నాయకుడు కె.అజయ్‌బాబు, రాష్ట్ర సమితి సభ్యుడు ఓబి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచుతున్న ఇంధన ధరలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులు, దినసరి కూలీలు, మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల భారం మరింత పెరిగిందన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, పప్పుదినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఉపశమనం కల్పించకుండా ప్రభుత్వాలు పన్నుల రూపంలో భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు.

పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, చమురుపై విధిస్తున్న ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు బి.ఎంకన్న, కల్లుబావి రాజు, ఈరన్న, రాజేష్‌, దేవా, నరసింహులు, వీరేష్‌తో పాటు హమాలి, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఏఐటీయూసీ ఆగ్రహం. ధరలు తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

Article Image

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం చందన బ్రదర్స్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వైటీ భీమరాజు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ సీనియర్‌ నాయకుడు కె.అజయ్‌బాబు, రాష్ట్ర సమితి సభ్యుడు ఓబి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచుతున్న ఇంధన ధరలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులు, దినసరి కూలీలు, మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల భారం మరింత పెరిగిందన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, పప్పుదినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఉపశమనం కల్పించకుండా ప్రభుత్వాలు పన్నుల రూపంలో భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు.

పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, చమురుపై విధిస్తున్న ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు బి.ఎంకన్న, కల్లుబావి రాజు, ఈరన్న, రాజేష్‌, దేవా, నరసింహులు, వీరేష్‌తో పాటు హమాలి, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News