Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:27 PM

పెరటి కోళ్ల అకాల మరణాల నివారణకు సర్జికల్ స్పిరిట్ వైద్యం

పెరటి కోళ్ల అకాల మరణాల నివారణకు సర్జికల్ స్పిరిట్ వైద్యం

పెరటి కోళ్ల అకాల మరణాల నివారణకు సర్జికల్ స్పిరిట్ వైద్యం
February 23, 2026 08:14 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

పెరటి కోళ్ల అకాల మరణాల నివారణకు సర్జికల్ స్పిరిట్ వైద్యం

ప్రతీ కుటుంబానికి పెరటికోళ్లు జీవ నిధిగా నిరంతరం ఆదాయాన్నిస్తూ కుటుంబ పోషణకి ఉపయోగపడుతున్నాయి.కోదాడ పట్టణం పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పెరటికోళ్లకి వైరస్ సోకి అకస్మాత్తుగా చనిపోతున్నాయి. రోజంతా మంచిగా తిని , నీరు తాగి చెట్ల మీద పడుకున్న కోళ్లు తెల్లారేసరికి మృత్యువాత పడుతున్నాయి. కొక్కెర రోగానికి ముందస్తుగా టీకాలు వేసిన కోళ్లు సైతం జబ్బున పడుతున్నాయి. కొక్కెర రోగం సోకిన కోళ్లు సైతం కీళ్ల జబ్బులు సోకి కాళ్లు వంకర్లు పోతూ నడవలేక తినలేక తిన్నది అరగక ఇబ్బంది పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా నిత్యం జబ్బు సోకిన కోళ్లతో కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల కిటకిటలాడుతుంది.

జబ్బు సోకిన కోళ్లని పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య వివిధ ఔషధాలతో వైద్యం చేస్తున్నా పూర్తిస్థాయిలో ఫలితం లేకపోవడం తో “ఓల్డ్ ఇజ్ గోల్డ్ “అన్న సామెత అనుసరించి పాతకాలంలో వైద్యం కోసం వాడిన సర్జికల్ స్పిరిట్ ని ఉపయోగించి ఈరోజు కోళ్ళకి నూతన వైద్యం ప్రారంభించారు.

జబ్బు సోకిన, కాళ్ళు పడిపోయిన కోళ్ళకి ఇన్సులిన్ సిరంజిలో 15 యూనిట్ల సర్జికల్ స్పిరిట్ తీసుకొని దానికి 35 యూనిట్స్ నార్మల్ డిస్టిల్డ్ వాటర్ కలిపి కోడి రెక్క రక్తనాళం లోకి ఎక్కించి, యాంటీబయాటిక్,బి కాంప్లెక్స్,నరాల టానిక్ ఇంజక్షన్ లు కూడా కండకి ఇవ్వడం ప్రారంభించారు. విషయం తెలిసి సర్జికల్ స్పిరిట్ వైద్యం కోసం కోళ్ళతో యజమానులు ప్రాంతీయ పశువైద్యశాలకు బారులు తీరారు.

అలాగే వైరస్ వ్యాధులు సోకకుండా ముందస్తుగా నివారణకోసం , వైద్యశాలకు వచ్చిన రైతులందరికీ 100 మిల్లీ లీటర్ల నీటిలో 15 మిల్లీ లీటర్ల స్పిరిట్ కలిపి ఒక్కో కోడికి 1.5 మి లీటర్లు పిల్లలకి నాలుగైదు చుక్కలు వారంరోజుల పాటు నోటిలో వేయడానికి సరిపడు ద్రావణం కలిపి ఇవ్వడం జరిగింది.

అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి పెంటయ్య మాట్లాడుతూ ఈ సీజన్ లో విరివిగా కోళ్లలో వైరస్ వ్యాధులు సోకుతాయని, ముందస్తు టీకాలు వేసినవాటికి సమస్య లేదు కానీ జబ్బు సోకి లక్షణాలు కనిపించడానికి వారం నుండి 14 రోజుల సమయం ఇంక్యుబేషిన్ పీరియడ్ పడుతుందని ఈ సమయం లో మాత్రం టీకాలు వేయరాదని, అలా వేసినట్లయితే ఉపయోగం లేకపోగా వైరస్ సోకిన కోళ్ళకి తిరిగి టీకా రూపేణా వైరస్ ఎక్కిస్తే వైరస్ తీవ్రత పెరిగి కోళ్లు చనిపోతాయని తెలిపారు.

సీనియర్ వైద్యుల సలహా మేరకు కోళ్లలో వ్యాధుల చికిత్స మరియు నివారణకు ఈరోజు మనదగ్గర సర్జికల్ స్పిరిట్ తో వైద్యం ప్రారంభించడం జరిగిందని ఇప్పటికైతే మంచి పలితాలున్నాయని, మునుముందు అసలు జబ్బులే సోకకుండా కాపాడడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

వ్యాధి మరింత విస్తరించకుండా జబ్బు సోకిన కోళ్లను గుంపు నుండి వేరు చేసి విడిగా ఉంచాలని, శక్తికోసం నీటితో గ్లూకోజ్ మరియు సమయానికి మేత ఇవ్వాలని, చనిపోయిన కోళ్లను బైట పడవేయకుండా గుంత తీసి ఉప్పు లేదా సున్నంతో పూడ్చి పెట్టాలని, పైన చెప్పిన విధంగా ప్రతీ ఇంట్లో తమకోళ్ళకి స్పిరిట్ ద్రావణం ఔషధాన్ని తాగించాలని సూచించారు.

చికిత్సా కార్యక్రమములో సిబ్బంది రాజు, చంద్రకళ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News