Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:24 AM

పీపల్ పహాడ్‌లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

పీపల్ పహాడ్‌లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

పీపల్ పహాడ్‌లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు
March 31, 2026 09:02 PM 176 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మహిళల హక్కులు, బెల్టు షాపులు, దొంగతనాల నివారణపై చర్చ


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలో సి డి ఈ డబ్ల్యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, బెల్టు షాపులు, దొంగతనాల నుంచి రక్షణతో పాటు మహిళల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టు షాపులను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సి డి ఈ డబ్ల్యు ప్రతినిధి శ్రీవాణి మహిళల భద్రత, చట్టపరమైన హక్కులపై వివరించారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మహిళా సంఘాల నాయకులు గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సులో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News