పీపల్ పహాడ్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు
పీపల్ పహాడ్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు
K.RAVI
మహిళల హక్కులు, బెల్టు షాపులు, దొంగతనాల నివారణపై చర్చ
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలో సి డి ఈ డబ్ల్యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, బెల్టు షాపులు, దొంగతనాల నుంచి రక్షణతో పాటు మహిళల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టు షాపులను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సి డి ఈ డబ్ల్యు ప్రతినిధి శ్రీవాణి మహిళల భద్రత, చట్టపరమైన హక్కులపై వివరించారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మహిళా సంఘాల నాయకులు గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ సదస్సులో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి