Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వెంకటేశం గౌడ్ బర్త్‌డే వేడుకలు చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 31, 2026 11:01 PM

పీపల్ పహాడ్‌లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

పీపల్ పహాడ్‌లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

పీపల్ పహాడ్‌లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు
March 31, 2026 09:02 PM 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మహిళల హక్కులు, బెల్టు షాపులు, దొంగతనాల నివారణపై చర్చ


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలో సి డి ఈ డబ్ల్యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, బెల్టు షాపులు, దొంగతనాల నుంచి రక్షణతో పాటు మహిళల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టు షాపులను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సి డి ఈ డబ్ల్యు ప్రతినిధి శ్రీవాణి మహిళల భద్రత, చట్టపరమైన హక్కులపై వివరించారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మహిళా సంఘాల నాయకులు గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సులో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News