Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:01 AM

పెనుకొండలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా – కార్యకర్తలే పార్టీ బలం: ఎంపీ బి.కే. పార్థసారథి

పెనుకొండలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా – కార్యకర్తలే పార్టీ బలం: ఎంపీ బి.కే. పార్థసారథి

పెనుకొండలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా – కార్యకర్తలే పార్టీ బలం: ఎంపీ బి.కే. పార్థసారథి
29-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మడకసిర రోడ్డులోని పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ, అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని నేతలు పేర్కొన్నారు. సమాజమే మా దేవాలయం, ప్రజలే మా దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

నాయకులు వస్తూ పోతుంటారని, కానీ పార్టీ శాశ్వతమని, కష్టపడ్డ కార్యకర్తలే పార్టీకి బలమని ఎంపీ బి.కే. పార్థసారథి అన్నారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.

అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Sthanikam

పెనుకొండలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా – కార్యకర్తలే పార్టీ బలం: ఎంపీ బి.కే. పార్థసారథి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మడకసిర రోడ్డులోని పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ, అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని నేతలు పేర్కొన్నారు. సమాజమే మా దేవాలయం, ప్రజలే మా దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

నాయకులు వస్తూ పోతుంటారని, కానీ పార్టీ శాశ్వతమని, కష్టపడ్డ కార్యకర్తలే పార్టీకి బలమని ఎంపీ బి.కే. పార్థసారథి అన్నారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.

అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News