పెనుకొండలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా – కార్యకర్తలే పార్టీ బలం: ఎంపీ బి.కే. పార్థసారథి
పెనుకొండలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా – కార్యకర్తలే పార్టీ బలం: ఎంపీ బి.కే. పార్థసారథి
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మడకసిర రోడ్డులోని పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ, అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని నేతలు పేర్కొన్నారు. సమాజమే మా దేవాలయం, ప్రజలే మా దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
నాయకులు వస్తూ పోతుంటారని, కానీ పార్టీ శాశ్వతమని, కష్టపడ్డ కార్యకర్తలే పార్టీకి బలమని ఎంపీ బి.కే. పార్థసారథి అన్నారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి