Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

పెనుకొండలో ఎంపీపీ పాఠశాలపై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ

పెనుకొండలో ఎంపీపీ పాఠశాలపై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ

పెనుకొండలో ఎంపీపీ పాఠశాలపై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ
20-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని బీటిఆర్ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై స్వయంగా పాఠశాలకు చేరుకున్న మంత్రి, విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి చదువు, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె, ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, లోపాలు గమనిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

పాఠశాల వంటగది మరియు ఆవరణాన్ని పరిశీలించిన మంత్రి, పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన వాతావరణం అత్యంత కీలకమని పేర్కొన్నారు.


Sthanikam

పెనుకొండలో ఎంపీపీ పాఠశాలపై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని బీటిఆర్ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై స్వయంగా పాఠశాలకు చేరుకున్న మంత్రి, విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి చదువు, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె, ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, లోపాలు గమనిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

పాఠశాల వంటగది మరియు ఆవరణాన్ని పరిశీలించిన మంత్రి, పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన వాతావరణం అత్యంత కీలకమని పేర్కొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News