Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:52 PM

పెనుకొండలో ఎంపీపీ పాఠశాలపై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ

పెనుకొండలో ఎంపీపీ పాఠశాలపై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ

పెనుకొండలో ఎంపీపీ పాఠశాలపై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ
March 20, 2026 07:18 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని బీటిఆర్ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై స్వయంగా పాఠశాలకు చేరుకున్న మంత్రి, విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి చదువు, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె, ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, లోపాలు గమనిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

పాఠశాల వంటగది మరియు ఆవరణాన్ని పరిశీలించిన మంత్రి, పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన వాతావరణం అత్యంత కీలకమని పేర్కొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News