శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని బీటిఆర్ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై స్వయంగా పాఠశాలకు చేరుకున్న మంత్రి, విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి చదువు, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె, ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, లోపాలు గమనిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
పాఠశాల వంటగది మరియు ఆవరణాన్ని పరిశీలించిన మంత్రి, పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన వాతావరణం అత్యంత కీలకమని పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి