Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

పెనుకొండలో విద్యుత్ సమస్యలపై మంత్రి సవిత సమీక్ష

పెనుకొండలో విద్యుత్ సమస్యలపై మంత్రి సవిత సమీక్ష

పెనుకొండలో విద్యుత్ సమస్యలపై మంత్రి సవిత సమీక్ష
19-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత & జౌళి శాఖామాత్యులు శ్రీమతి సవిత విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని విద్యుత్ సరఫరా పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.

రైతులకు అందుతున్న విద్యుత్ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి, ట్రాన్స్‌ఫార్మర్లపై పెరుగుతున్న లోడ్, మార్పిడి వేగం, గ్రామీణ విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్కువ వోల్టేజ్, ఓవర్‌లోడ్ సమస్యలు, పాడైన లైన్ల మరమ్మత్తులు, కొత్త లైన్ల ఏర్పాటు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.

రైతుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించిన మంత్రి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. సమావేశంలో యస్ఇ మోసెస్, డిఇ లు చంద్రనాయక్, జ్యోత్స్న, ఎడి శేషగిరి, ఎఇ లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పెనుకొండలో విద్యుత్ సమస్యలపై మంత్రి సవిత సమీక్ష

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత & జౌళి శాఖామాత్యులు శ్రీమతి సవిత విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని విద్యుత్ సరఫరా పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.

రైతులకు అందుతున్న విద్యుత్ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి, ట్రాన్స్‌ఫార్మర్లపై పెరుగుతున్న లోడ్, మార్పిడి వేగం, గ్రామీణ విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్కువ వోల్టేజ్, ఓవర్‌లోడ్ సమస్యలు, పాడైన లైన్ల మరమ్మత్తులు, కొత్త లైన్ల ఏర్పాటు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.

రైతుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించిన మంత్రి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. సమావేశంలో యస్ఇ మోసెస్, డిఇ లు చంద్రనాయక్, జ్యోత్స్న, ఎడి శేషగిరి, ఎఇ లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News