Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 19, 2026 05:30 AM

పెనుకొండలో విద్యుత్ సమస్యలపై మంత్రి సవిత సమీక్ష

పెనుకొండలో విద్యుత్ సమస్యలపై మంత్రి సవిత సమీక్ష

పెనుకొండలో విద్యుత్ సమస్యలపై మంత్రి సవిత సమీక్ష
March 19, 2026 03:03 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత & జౌళి శాఖామాత్యులు శ్రీమతి సవిత విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని విద్యుత్ సరఫరా పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.

రైతులకు అందుతున్న విద్యుత్ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి, ట్రాన్స్‌ఫార్మర్లపై పెరుగుతున్న లోడ్, మార్పిడి వేగం, గ్రామీణ విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్కువ వోల్టేజ్, ఓవర్‌లోడ్ సమస్యలు, పాడైన లైన్ల మరమ్మత్తులు, కొత్త లైన్ల ఏర్పాటు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.

రైతుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించిన మంత్రి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. సమావేశంలో యస్ఇ మోసెస్, డిఇ లు చంద్రనాయక్, జ్యోత్స్న, ఎడి శేషగిరి, ఎఇ లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News