Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 07:46 PM

పెనుకొండలో బీజేపీ నిరసన ర్యాలీ – కాంగ్రెస్‌పై ఆగ్రహం

పెనుకొండలో బీజేపీ నిరసన ర్యాలీ – కాంగ్రెస్‌పై ఆగ్రహం

పెనుకొండలో బీజేపీ నిరసన ర్యాలీ – కాంగ్రెస్‌పై ఆగ్రహం
February 23, 2026 06:02 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా / పెనుకొండ:

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బిల్లు కుల్లాయప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా సాగింది.

ర్యాలీ అనంతరం నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ, కాంగ్రెస్ నాయకుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టను పెంచుకుంటోందని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా గ్లోబల్ ఏఐ సమ్మిట్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల ద్వారా భారతదేశం సాంకేతిక రంగంలో ముందంజలో నిలుస్తోందని తెలిపారు. అలాంటి సందర్భంలో దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం బాధాకరమని విమర్శించారు.

దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలతో కలిసి పనిచేయాలని, లేకపోతే ప్రజలే తగిన నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కూటమి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News