Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

పెనుకొండలో అక్రమ గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

పెనుకొండలో అక్రమ గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

పెనుకొండలో అక్రమ గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
March 14, 2026 06:25 AM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ, : జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజినల్ అధికారి పర్యవేక్షణలో పెనుకొండ మరియు పరిసర ప్రాంతాలలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించి మొత్తం 19 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

విజయలక్ష్మి రెస్టారెంట్ సమీపంలోని 4 ఆర్సిబీ టీ స్టాల్ వద్ద 2, గుట్టూరులోని అభిరుచి కంచర్ల రెస్టారెంట్ వద్ద 6, పెనుకొండలోని శ్రీ మారుతి అయ్యంగారు బేకరీ వద్ద 2, షఫీయా గ్రాండ్ వద్ద 3, కియా కంపెనీ ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద 2 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ తనిఖీలలో పెనుకొండ డివిజన్ సహాయ పౌర సరఫరాల అధికారి ఎన్.రమేష్, తహశీల్దార్ కె.స్వాతి, పౌర సరఫరాల ఉప తహశీల్దార్ జి.ప్రభావతి, వీఆర్‌ఓ బషీర్ పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News