Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:14 PM

పెనుకొండలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు

పెనుకొండలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు

పెనుకొండలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు
February 23, 2026 06:55 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ ఐసిడిఎస్ కార్యాలయం ముందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో,సెంటర్ అఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) మద్దతుతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు జయమ్మ, కార్యదర్శి బావమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మండల కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న 1810 మినీ వర్కర్లకు అర్హతల సడలింపు ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. గ్రాట్యుటీ అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అర్బన్, రూరల్ తేడా లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్ట గైడ్లైన్స్ రూపొందించాలని తెలిపారు. మే నెలంతా వేసవి సెలవుల జీఓ వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు.

లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు పరిమాణం పెంచి, మెనూ చార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, ఫ్రీ స్కూల్ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు తిప్పన్న, యూనియన్ కోశాధికారి మా బున్నీసా, సెక్టార్ లీడర్లు లక్ష్మీదేవి, అనిత, సరస్వతి, పార్వతి, శాంతి భాయ్, మీనా, సుజాత, సుధామణి తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News