Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:51 PM

పెనుకొండలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు

పెనుకొండలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు

పెనుకొండలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు
February 23, 2026 06:55 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ ఐసిడిఎస్ కార్యాలయం ముందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో,సెంటర్ అఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) మద్దతుతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు జయమ్మ, కార్యదర్శి బావమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మండల కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న 1810 మినీ వర్కర్లకు అర్హతల సడలింపు ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. గ్రాట్యుటీ అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అర్బన్, రూరల్ తేడా లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్ట గైడ్లైన్స్ రూపొందించాలని తెలిపారు. మే నెలంతా వేసవి సెలవుల జీఓ వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు.

లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు పరిమాణం పెంచి, మెనూ చార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, ఫ్రీ స్కూల్ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు తిప్పన్న, యూనియన్ కోశాధికారి మా బున్నీసా, సెక్టార్ లీడర్లు లక్ష్మీదేవి, అనిత, సరస్వతి, పార్వతి, శాంతి భాయ్, మీనా, సుజాత, సుధామణి తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News