పెనుకొండలో ఆదికవయిత్రి మొల్ల జయంతి
పెనుకొండలో ఆదికవయిత్రి మొల్ల జయంతి
EDIGA NAVEENKUMAR
పెనుకొండ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఆదికవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా పెనుకొండ పట్టణంలో కార్యక్రమం నిర్వహించారు. పెనుకొండ నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు సవిత సూచనల మేరకు పెనుకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మొల్ల జయంతి వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు కలిసి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సులభమైన తెలుగు భాషలో మొల్ల రామాయణం రచించి తెలుగు సాహిత్యానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.
మహిళలు కూడా సాహిత్యం, జ్ఞానంలో ఉన్నత స్థాయికి ఎదగగలరని మొల్ల జీవితం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. తెలుగు భాష అభివృద్ధికి, సాహిత్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెనుకొండ టిడిపి అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, నాయకులు ప్రభంజన్ స్వామి, చెండ్రాయుడు, కురబ నంజుండ, కుమ్మరి ఆంజనేయులు, ఎస్.రాము, పులుగూర శ్రీనివాసులు, బీజేపీ రామకృష్ణ, బోయ సోము, మల్లికార్జున, జనసేన శ్రీదేవి, సలీం బాషా, ఇక్బాల్, అమాన్, గంగన్నతో పాటు టిడిపి/ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి