Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:02 AM

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి
February 19, 2026 07:21 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా కలెక్టర్ హనుమంత రావు

పీఎం శ్రీ నిధుల నుంచి మంజూరైన పాఠశాలల్లో సివిల్ పనులు పెండింగ్ లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై అధికారులను కలెక్టర్ ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలకు మంజూరైన నిధులను నిబంధనల ప్రకారం ఎంత మేర వినియోగించారో ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పథకం పరిధిలో ఉన్న పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు, లైబ్రరీ గదుల నిర్మాణానికి మంజూరైన నిధులతో చేపట్టిన పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కోటమర్తి, మల్లాపూర్, భువనగిరి గంజ్ పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి, నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్‌కు ఆదేశించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు నిర్ణీత కాలవ్యవధిలో సక్రమంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులతో నిరంతర సమన్వయం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్,డివిజనల్ ఇంజనీర్ శివకుమార్, ప్రధానోపాధ్యాయులు మరియు అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News