పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి
పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి
Sthanikam District Staff Reporter
జిల్లా కలెక్టర్ హనుమంత రావు
పీఎం శ్రీ నిధుల నుంచి మంజూరైన పాఠశాలల్లో సివిల్ పనులు పెండింగ్ లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మినీ మీటింగ్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై అధికారులను కలెక్టర్ ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలకు మంజూరైన నిధులను నిబంధనల ప్రకారం ఎంత మేర వినియోగించారో ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పథకం పరిధిలో ఉన్న పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, అదనపు తరగతి గదులు, లైబ్రరీ గదుల నిర్మాణానికి మంజూరైన నిధులతో చేపట్టిన పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కోటమర్తి, మల్లాపూర్, భువనగిరి గంజ్ పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి, నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్కు ఆదేశించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు నిర్ణీత కాలవ్యవధిలో సక్రమంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులతో నిరంతర సమన్వయం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్,డివిజనల్ ఇంజనీర్ శివకుమార్, ప్రధానోపాధ్యాయులు మరియు అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి