Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:41 AM

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి
February 19, 2026 07:21 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా కలెక్టర్ హనుమంత రావు

పీఎం శ్రీ నిధుల నుంచి మంజూరైన పాఠశాలల్లో సివిల్ పనులు పెండింగ్ లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై అధికారులను కలెక్టర్ ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలకు మంజూరైన నిధులను నిబంధనల ప్రకారం ఎంత మేర వినియోగించారో ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పథకం పరిధిలో ఉన్న పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు, లైబ్రరీ గదుల నిర్మాణానికి మంజూరైన నిధులతో చేపట్టిన పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కోటమర్తి, మల్లాపూర్, భువనగిరి గంజ్ పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి, నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్‌కు ఆదేశించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు నిర్ణీత కాలవ్యవధిలో సక్రమంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులతో నిరంతర సమన్వయం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్,డివిజనల్ ఇంజనీర్ శివకుమార్, ప్రధానోపాధ్యాయులు మరియు అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News