Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి
February 19, 2026 07:21 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా కలెక్టర్ హనుమంత రావు

పీఎం శ్రీ నిధుల నుంచి మంజూరైన పాఠశాలల్లో సివిల్ పనులు పెండింగ్ లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై అధికారులను కలెక్టర్ ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలకు మంజూరైన నిధులను నిబంధనల ప్రకారం ఎంత మేర వినియోగించారో ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పథకం పరిధిలో ఉన్న పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు, లైబ్రరీ గదుల నిర్మాణానికి మంజూరైన నిధులతో చేపట్టిన పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కోటమర్తి, మల్లాపూర్, భువనగిరి గంజ్ పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి, నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్‌కు ఆదేశించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు నిర్ణీత కాలవ్యవధిలో సక్రమంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులతో నిరంతర సమన్వయం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్,డివిజనల్ ఇంజనీర్ శివకుమార్, ప్రధానోపాధ్యాయులు మరియు అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News