Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:50 PM

పెండింగ్ విద్యా భవనాల పనులపై కఠిన ఆదేశాలు:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

పెండింగ్ విద్యా భవనాల పనులపై కఠిన ఆదేశాలు:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

పెండింగ్ విద్యా భవనాల పనులపై కఠిన ఆదేశాలు:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
February 20, 2026 07:48 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా లోని పాఠశాలలు, నివాస పాఠశాలలలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మండల విద్యాధికారులు, సమగ్ర శిక్ష విభాగం సిబ్బందితో కలిసి వివిధ నిర్మాణ పనుల పురోగతిని సమగ్రంగా పరిశీలించారు.ప్రధానమంత్రి పాఠశాల అభివృద్ధి పథకం, భవిత కేంద్రాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల భవన నిర్మాణాలతో పాటు ఇతర విద్యా సదుపాయాల పనులపై వివరాలు తీసుకున్నారు. భవిత కేంద్రాల నిర్మాణంలో జహీరాబాద్, మోగుడంపల్లి, కల్హేర్, కొండాపూర్, మనోహరాబాద్, మునిపల్లి, పుల్కల్, సిర్గాపూర్, కంగ్టి మండలాల్లో పనుల పురోగతిని తెలుసుకుని వేగం పెంచాలని ఆదేశించారు.అలాగే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల భవన నిర్మాణాల్లో న్యాల్కల్, నాగలిగిద్ద, పుల్కల్, మనూర్, సిర్గాపూర్, వట్పల్లి ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.ప్రధానమంత్రి పాఠశాల అభివృద్ధి పథకం కింద సైన్స్ ప్రయోగశాలలు, అదనపు గదుల నిర్మాణాలపై పురోగతిని సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలను మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.పథకాల నిధుల వినియోగం, విద్యా గణాంకాల నమోదు, ప్రాథమిక పూర్వ తరగతుల నిర్వహణ అంశాలపై కూడా చర్చించి డేటా ఖచ్చితత్వం, పనితీరుపై సంబంధిత శాఖలకు సూచనలు చేశారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారులు, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News