పేదలందరికీ సంక్షేమ పథకాలే లక్ష్యం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్
పేదలందరికీ సంక్షేమ పథకాలే లక్ష్యం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్
K.RAVI
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 13వ వార్డులో సభ
లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు కట్టుబాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యమని 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ తెలిపారు.పురపాలక పరిధిలోని 13వ వార్డులో గురువారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వార్డు సభలు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ముఖ్య వేదికలుగా నిలుస్తాయని ఆమె తెలిపారు. సభలో ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, మహిళా శక్తి, రైతు భరోసా, మహిళా సంఘాల వడ్డీ రుణాల వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి