Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:20 PM

పేదలకు వరం ‘గృహజ్యోతి’పథకం

పేదలకు వరం ‘గృహజ్యోతి’పథకం

పేదలకు వరం ‘గృహజ్యోతి’పథకం
January 14, 2026 06:48 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత పథకం ప్రారంభించి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గృహ జ్యోతి లబ్ధి దారులకు వారి పేర్లతో వ్యక్తిగతంగా లేఖలు రాశారు . దీనిలో భాగంగా తూర్పుగూడెం గ్రామంలో గృహ జ్యోతి పథకం లేఖలను లబ్ధిదారులకు టీజీ ఎస్పీడీసీఎల్ సిబ్బంది,సర్పంచ్ దాసరి ఎల్లమ్మ శ్రీనివాస్,ఉప సర్పంచ్ కన్నెబోయిన కళ్యాణ్ వార్డ్ మెంబర్ లు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో ఒకటైన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించి మధ్యతర‌గ‌తి కుటుంబాలకు, పేదలకు ఆర్థిక పరమైన వెసులుబాటు కలిగించిన ప్రజా ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా 52,82,498 కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు.ఒక్క తూర్పుగూడెం గ్రామంలో గృహ జ్యోతి పథకం ద్వారా 250 మందికి ఈ పథకం ద్వారా లబ్దిచేకూరిందని తెలిపారుమహిళ లకు ఉచిత బస్ సౌకర్యం ,500 కే సిలిండర్ , రేషన్ కార్డు,రైతు భరోసా,కళ్యాణ లక్ష్మి,రుణ మాఫీ ముఖ్యమంత్రి సహాయనిది వంటి పథకాలు దేశం లోనే తెలంగాణ అదర్శమని అన్నారు ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని జిల్లా నాయకులు దాసరి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ హజారి శ్రీనివాస్,గుండగాని రమేష్,లింగంపల్లి హన్మంతు,కొమురెల్లి,గుండగాని మహేందర్,శ్రీకాంత్,క్రాంతి కుమార్,సంకినేని రమేష్,గుండ్ల మణికంఠ,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News