పేదలకు వరం ‘గృహజ్యోతి’పథకం
పేదలకు వరం ‘గృహజ్యోతి’పథకం
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత పథకం ప్రారంభించి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గృహ జ్యోతి లబ్ధి దారులకు వారి పేర్లతో వ్యక్తిగతంగా లేఖలు రాశారు . దీనిలో భాగంగా తూర్పుగూడెం గ్రామంలో గృహ జ్యోతి పథకం లేఖలను లబ్ధిదారులకు టీజీ ఎస్పీడీసీఎల్ సిబ్బంది,సర్పంచ్ దాసరి ఎల్లమ్మ శ్రీనివాస్,ఉప సర్పంచ్ కన్నెబోయిన కళ్యాణ్ వార్డ్ మెంబర్ లు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో ఒకటైన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించి మధ్యతరగతి కుటుంబాలకు, పేదలకు ఆర్థిక పరమైన వెసులుబాటు కలిగించిన ప్రజా ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా 52,82,498 కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు.ఒక్క తూర్పుగూడెం గ్రామంలో గృహ జ్యోతి పథకం ద్వారా 250 మందికి ఈ పథకం ద్వారా లబ్దిచేకూరిందని తెలిపారుమహిళ లకు ఉచిత బస్ సౌకర్యం ,500 కే సిలిండర్ , రేషన్ కార్డు,రైతు భరోసా,కళ్యాణ లక్ష్మి,రుణ మాఫీ ముఖ్యమంత్రి సహాయనిది వంటి పథకాలు దేశం లోనే తెలంగాణ అదర్శమని అన్నారు ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని జిల్లా నాయకులు దాసరి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ హజారి శ్రీనివాస్,గుండగాని రమేష్,లింగంపల్లి హన్మంతు,కొమురెల్లి,గుండగాని మహేందర్,శ్రీకాంత్,క్రాంతి కుమార్,సంకినేని రమేష్,గుండ్ల మణికంఠ,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి