పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
Harish K
పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందించాలి
డాక్టర్లు సేవా భావంతో పనిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
మున్సిపల్ చైర్ పర్సన్ యెర్నేని కుసుమ వెంకటరత్నం బాబు
కోదాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్విత్ హాస్పిటల్ ను మున్సిపల్ చైర్ పర్సన్ యెర్నేని కుసుమ వెంకటరత్నం బాబు,ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడం అత్యంత ముఖ్యమని అన్నారు.తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్నారు.డాక్టర్లు సేవా భావంతో పనిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, మాజీ డీసీసీ వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, డాక్టర్ ఏటుకూరి రామారావు, జనార్ధన్, సంజీవ్, హాస్పిటల్ నిర్వహకులు డాక్టర్ పృథ్వి కుమార్, రసజ్ఞ రెడ్డి, రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి