Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:41 AM

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం
February 09, 2026 07:52 AM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆయన చిట్యాల పదో వార్డులో సిలివేరు శేఖర్ మద్దతు గా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వలనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిర ఇండ్లను మంజూరు చేసిందని తెలియజేశారు. పదవ వార్డులో 90 సీసీ కెమెరాలతో పటిష్టం చేస్తామనిఅన్నారు. చిట్యాల అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేశారు. అంతేకాకుండా సామాన్య వ్యక్తులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థానాన్ని కల్పిస్తుందని, ఎటువంటి తేడాలు లేకుండా కష్టపడే వారిని గుర్తిస్తుందని అన్నారు. మనం ఎన్నుకునే ప్రతినిధులు అందుబాటులో ఉంటారా ఉండరా ఆలోచించి ఓటు వేసి అన్నారు పదో వార్డులో సర్వే చేయించిన తర్వాత 75% ప్రజలు సిలువేరు శేఖర్ ని కోరుకున్నారని ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని కోరారు. బి.ఆర్.ఎస్ పార్టీ నుండి కంభంపాటి సతీష్ తో పాటు వార్డులో ఉన్న యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు, వెంకన్న, రమేష్, కొసనం అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News