Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:33 PM

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం
February 09, 2026 07:52 AM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆయన చిట్యాల పదో వార్డులో సిలివేరు శేఖర్ మద్దతు గా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వలనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిర ఇండ్లను మంజూరు చేసిందని తెలియజేశారు. పదవ వార్డులో 90 సీసీ కెమెరాలతో పటిష్టం చేస్తామనిఅన్నారు. చిట్యాల అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేశారు. అంతేకాకుండా సామాన్య వ్యక్తులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థానాన్ని కల్పిస్తుందని, ఎటువంటి తేడాలు లేకుండా కష్టపడే వారిని గుర్తిస్తుందని అన్నారు. మనం ఎన్నుకునే ప్రతినిధులు అందుబాటులో ఉంటారా ఉండరా ఆలోచించి ఓటు వేసి అన్నారు పదో వార్డులో సర్వే చేయించిన తర్వాత 75% ప్రజలు సిలువేరు శేఖర్ ని కోరుకున్నారని ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని కోరారు. బి.ఆర్.ఎస్ పార్టీ నుండి కంభంపాటి సతీష్ తో పాటు వార్డులో ఉన్న యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు, వెంకన్న, రమేష్, కొసనం అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News