పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం
Komidala Mahender reddy
పెదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆయన చిట్యాల పదో వార్డులో సిలివేరు శేఖర్ మద్దతు గా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వలనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిర ఇండ్లను మంజూరు చేసిందని తెలియజేశారు. పదవ వార్డులో 90 సీసీ కెమెరాలతో పటిష్టం చేస్తామనిఅన్నారు. చిట్యాల అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేశారు. అంతేకాకుండా సామాన్య వ్యక్తులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థానాన్ని కల్పిస్తుందని, ఎటువంటి తేడాలు లేకుండా కష్టపడే వారిని గుర్తిస్తుందని అన్నారు. మనం ఎన్నుకునే ప్రతినిధులు అందుబాటులో ఉంటారా ఉండరా ఆలోచించి ఓటు వేసి అన్నారు పదో వార్డులో సర్వే చేయించిన తర్వాత 75% ప్రజలు సిలువేరు శేఖర్ ని కోరుకున్నారని ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని కోరారు. బి.ఆర్.ఎస్ పార్టీ నుండి కంభంపాటి సతీష్ తో పాటు వార్డులో ఉన్న యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు, వెంకన్న, రమేష్, కొసనం అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి