Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:10 AM

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం
February 09, 2026 07:52 AM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆయన చిట్యాల పదో వార్డులో సిలివేరు శేఖర్ మద్దతు గా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వలనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిర ఇండ్లను మంజూరు చేసిందని తెలియజేశారు. పదవ వార్డులో 90 సీసీ కెమెరాలతో పటిష్టం చేస్తామనిఅన్నారు. చిట్యాల అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేశారు. అంతేకాకుండా సామాన్య వ్యక్తులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థానాన్ని కల్పిస్తుందని, ఎటువంటి తేడాలు లేకుండా కష్టపడే వారిని గుర్తిస్తుందని అన్నారు. మనం ఎన్నుకునే ప్రతినిధులు అందుబాటులో ఉంటారా ఉండరా ఆలోచించి ఓటు వేసి అన్నారు పదో వార్డులో సర్వే చేయించిన తర్వాత 75% ప్రజలు సిలువేరు శేఖర్ ని కోరుకున్నారని ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని కోరారు. బి.ఆర్.ఎస్ పార్టీ నుండి కంభంపాటి సతీష్ తో పాటు వార్డులో ఉన్న యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు, వెంకన్న, రమేష్, కొసనం అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News