పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం: ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం: ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్దా మండల షాపూర్ గ్రామానికి చెందిన ఎస్గి నాగశెట్టి కుటుంబం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహాన్ని సందర్శించిన ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నివాసం అవసరమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన గృహంలో ఆ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాల మధ్య జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహాలింగ్ పటేల్, సిద్దప్ప, విజయ్ కుమార్ స్వామి తదితరులు, గ్రామస్తులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి