Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 03:10 AM

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం: ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం: ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం: ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
May 15, 2026 09:06 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్దా మండల షాపూర్ గ్రామానికి చెందిన ఎస్గి నాగశెట్టి కుటుంబం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహాన్ని సందర్శించిన ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నివాసం అవసరమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన గృహంలో ఆ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాల మధ్య జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహాలింగ్ పటేల్, సిద్దప్ప, విజయ్ కుమార్ స్వామి తదితరులు, గ్రామస్తులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News