పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. గుత్తా సుఖేందర్ రెడ్డి
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. గుత్తా సుఖేందర్ రెడ్డి
NM Yadav
48 మంది లబ్ధిదారులకు రూ. 19 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
నల్గొండ : పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 48 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 19,00,000 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయని కొనియాడారు.ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఒక వరమని ఇది ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అట్టడుగు వర్గాలకు చేరువవుతున్నాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. సకాలంలో తమకు ఆర్థిక సాయం అందడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి