Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:42 PM

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. గుత్తా సుఖేందర్ రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. గుత్తా సుఖేందర్ రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. గుత్తా సుఖేందర్ రెడ్డి
March 23, 2026 12:45 AM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

48 మంది లబ్ధిదారులకు రూ. 19 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

నల్గొండ : పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 48 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 19,00,000 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయని కొనియాడారు.ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఒక వరమని ఇది ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అట్టడుగు వర్గాలకు చేరువవుతున్నాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. సకాలంలో తమకు ఆర్థిక సాయం అందడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News