పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి
పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి
K.RAVI
పేద ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి విరివిగా విరాళాలు అందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని ప్రారంభించి సామూహిక నిధుల సేకరణ చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో స్థాపితమైన సిపిఐ దేశ స్వాతంత్ర్య సాధనతో పాటు పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది త్యాగాలతో అనేక గ్రామాలను విముక్తి చేసి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘన చరిత్ర సిపిఐదేనని అన్నారు.ఆ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటాల గడ్డగా పేరుపొందిందని, దేశవ్యాప్తంగా భూసంస్కరణల కోసం “దున్నేవాడికే భూమి” నినాదంతో పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకే ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఈ పార్టీకి ప్రజలు, శ్రేయోభిలాషులు, వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు అందరూ తమ వంతు సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, కొండూరు వెంకటేష్, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, టంగుటూరి రాములు, నీల బిక్షపతి, దాసరి మనోహర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి