Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అనుమతి లేని డిగ్రీ కళాశాలలపై ఆందోళన. ఎర్రవెల్లి కృష్ణ బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 05:12 PM

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి
April 02, 2026 03:07 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పేద ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి విరివిగా విరాళాలు అందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని ప్రారంభించి సామూహిక నిధుల సేకరణ చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో స్థాపితమైన సిపిఐ దేశ స్వాతంత్ర్య సాధనతో పాటు పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది త్యాగాలతో అనేక గ్రామాలను విముక్తి చేసి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘన చరిత్ర సిపిఐదేనని అన్నారు.ఆ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటాల గడ్డగా పేరుపొందిందని, దేశవ్యాప్తంగా భూసంస్కరణల కోసం “దున్నేవాడికే భూమి” నినాదంతో పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకే ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఈ పార్టీకి ప్రజలు, శ్రేయోభిలాషులు, వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు అందరూ తమ వంతు సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, కొండూరు వెంకటేష్, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, టంగుటూరి రాములు, నీల బిక్షపతి, దాసరి మనోహర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News