Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:57 PM

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి
April 02, 2026 03:07 PM 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పేద ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి విరివిగా విరాళాలు అందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని ప్రారంభించి సామూహిక నిధుల సేకరణ చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో స్థాపితమైన సిపిఐ దేశ స్వాతంత్ర్య సాధనతో పాటు పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది త్యాగాలతో అనేక గ్రామాలను విముక్తి చేసి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘన చరిత్ర సిపిఐదేనని అన్నారు.ఆ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటాల గడ్డగా పేరుపొందిందని, దేశవ్యాప్తంగా భూసంస్కరణల కోసం “దున్నేవాడికే భూమి” నినాదంతో పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకే ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఈ పార్టీకి ప్రజలు, శ్రేయోభిలాషులు, వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు అందరూ తమ వంతు సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, కొండూరు వెంకటేష్, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, టంగుటూరి రాములు, నీల బిక్షపతి, దాసరి మనోహర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News