Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:11 AM

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి
02-04-2026 188 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పేద ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి విరివిగా విరాళాలు అందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని ప్రారంభించి సామూహిక నిధుల సేకరణ చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో స్థాపితమైన సిపిఐ దేశ స్వాతంత్ర్య సాధనతో పాటు పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది త్యాగాలతో అనేక గ్రామాలను విముక్తి చేసి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘన చరిత్ర సిపిఐదేనని అన్నారు.ఆ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటాల గడ్డగా పేరుపొందిందని, దేశవ్యాప్తంగా భూసంస్కరణల కోసం “దున్నేవాడికే భూమి” నినాదంతో పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకే ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఈ పార్టీకి ప్రజలు, శ్రేయోభిలాషులు, వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు అందరూ తమ వంతు సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, కొండూరు వెంకటేష్, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, టంగుటూరి రాములు, నీల బిక్షపతి, దాసరి మనోహర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి

Article Image

పేద ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి విరివిగా విరాళాలు అందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని ప్రారంభించి సామూహిక నిధుల సేకరణ చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో స్థాపితమైన సిపిఐ దేశ స్వాతంత్ర్య సాధనతో పాటు పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది త్యాగాలతో అనేక గ్రామాలను విముక్తి చేసి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘన చరిత్ర సిపిఐదేనని అన్నారు.ఆ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటాల గడ్డగా పేరుపొందిందని, దేశవ్యాప్తంగా భూసంస్కరణల కోసం “దున్నేవాడికే భూమి” నినాదంతో పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకే ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఈ పార్టీకి ప్రజలు, శ్రేయోభిలాషులు, వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు అందరూ తమ వంతు సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, కొండూరు వెంకటేష్, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, టంగుటూరి రాములు, నీల బిక్షపతి, దాసరి మనోహర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News