Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:07 AM

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం
26-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు – సేవలను కొనియాడిన నాయకులు

పేద ప్రజల ఆశాజ్యోతి, స్వాతంత్ర సమరయోధుడు, నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతిని గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తంగడుపల్లి రోడ్‌లో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు, కార్యకర్తలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ధర్మభిక్షం పేదల కోసం నిరంతరం పోరాడిన మహానేత అని కొనియాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు.“దున్నేవానికి భూమి కావాలి, గీసేవానికి చెట్టు కావాలి” అనే నినాదాలతో పేదల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ముఖ్యంగా రాచకొండ గుట్టల్లో ఏర్పాటు చేయదలచిన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించి దాన్ని రద్దు చేయించిన ఘనత ధర్మభిక్షం దేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, గీత పనివాళ్ల సంఘం నాయకులు నీళ్ల బిక్షపతి, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, రోషనగారి అంజయ్య, దాసరి మనోహర్, కట్టెల లింగస్వామి, దాసరి కృష్ణ, యాదయ్య, నీళ్ల సంతోష తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం

Article Image

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు – సేవలను కొనియాడిన నాయకులు

పేద ప్రజల ఆశాజ్యోతి, స్వాతంత్ర సమరయోధుడు, నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతిని గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తంగడుపల్లి రోడ్‌లో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు, కార్యకర్తలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ధర్మభిక్షం పేదల కోసం నిరంతరం పోరాడిన మహానేత అని కొనియాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు.“దున్నేవానికి భూమి కావాలి, గీసేవానికి చెట్టు కావాలి” అనే నినాదాలతో పేదల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ముఖ్యంగా రాచకొండ గుట్టల్లో ఏర్పాటు చేయదలచిన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించి దాన్ని రద్దు చేయించిన ఘనత ధర్మభిక్షం దేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, గీత పనివాళ్ల సంఘం నాయకులు నీళ్ల బిక్షపతి, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, రోషనగారి అంజయ్య, దాసరి మనోహర్, కట్టెల లింగస్వామి, దాసరి కృష్ణ, యాదయ్య, నీళ్ల సంతోష తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News