Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:52 PM

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం
March 26, 2026 04:05 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు – సేవలను కొనియాడిన నాయకులు

పేద ప్రజల ఆశాజ్యోతి, స్వాతంత్ర సమరయోధుడు, నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతిని గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తంగడుపల్లి రోడ్‌లో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు, కార్యకర్తలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ధర్మభిక్షం పేదల కోసం నిరంతరం పోరాడిన మహానేత అని కొనియాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు.“దున్నేవానికి భూమి కావాలి, గీసేవానికి చెట్టు కావాలి” అనే నినాదాలతో పేదల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ముఖ్యంగా రాచకొండ గుట్టల్లో ఏర్పాటు చేయదలచిన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించి దాన్ని రద్దు చేయించిన ఘనత ధర్మభిక్షం దేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, గీత పనివాళ్ల సంఘం నాయకులు నీళ్ల బిక్షపతి, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, రోషనగారి అంజయ్య, దాసరి మనోహర్, కట్టెల లింగస్వామి, దాసరి కృష్ణ, యాదయ్య, నీళ్ల సంతోష తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News