Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:21 AM

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
March 24, 2026 05:26 PM 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచిత ఆరోగ్య మేళా ప్రారంభం – చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి)లో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య మేళాను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని విభాగాలను పరిశీలించిన చైర్‌పర్సన్, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న ఆరోగ్య మేళాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.మేళాలో భాగంగా బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు కోయడ శేఖర్, బుడ్డ సురేష్, నాయకులు కేతరాజు అచ్చయ్య, ఆలే చిరంజీవి, మండల స్థాయి అధికారులు, వైద్యులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News