Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 24, 2026 07:09 PM

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
March 24, 2026 05:26 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచిత ఆరోగ్య మేళా ప్రారంభం – చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి)లో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య మేళాను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని విభాగాలను పరిశీలించిన చైర్‌పర్సన్, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న ఆరోగ్య మేళాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.మేళాలో భాగంగా బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు కోయడ శేఖర్, బుడ్డ సురేష్, నాయకులు కేతరాజు అచ్చయ్య, ఆలే చిరంజీవి, మండల స్థాయి అధికారులు, వైద్యులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News