పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన హ్యూమన్ రైట్స్ సేవా కార్యక్రమం
పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన హ్యూమన్ రైట్స్ సేవా కార్యక్రమం
Krishna
ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ
తొర్రూరు డివిజన్ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా, స్థానిక మున్సిపల్ కేంద్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అజర హాస్పిటల్ సహకారంతో మెగా ఆరోగ్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎంపీ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించగా,నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా మంగళ పెల్లి హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై మెగా ఆరోగ్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ మాట్లాడుతూ, ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. అజర హాస్పిటల్కు చెందిన డాక్టర్ భరత్ ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొని రోగులకు ఉచితంగా సాధారణ వైద్య పరీక్షలు,రక్తపోటు,రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించడం అభినందనీయమని తెలిపారు.ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా బృంద సభ్యులు డాక్టర్ భరత్, ఆర్ఎంపీ ప్రకాష్, రాజేష్లను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసు, చిన్ని,రాజు,మురళి,కృష్ణ, బాలకృష్ణ,రాజేష్,మహేష్తో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు,మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి