Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:52 AM

పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన హ్యూమన్ రైట్స్ సేవా కార్యక్రమం

పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన హ్యూమన్ రైట్స్ సేవా కార్యక్రమం

పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన హ్యూమన్ రైట్స్ సేవా కార్యక్రమం
January 22, 2026 08:15 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ


తొర్రూరు డివిజన్ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా, స్థానిక మున్సిపల్ కేంద్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అజర హాస్పిటల్ సహకారంతో మెగా ఆరోగ్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్‌ఎంపీ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించగా,నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా మంగళ పెల్లి హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై మెగా ఆరోగ్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ మాట్లాడుతూ, ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. అజర హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ భరత్ ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొని రోగులకు ఉచితంగా సాధారణ వైద్య పరీక్షలు,రక్తపోటు,రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించడం అభినందనీయమని తెలిపారు.ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా బృంద సభ్యులు డాక్టర్ భరత్, ఆర్‌ఎంపీ ప్రకాష్, రాజేష్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసు, చిన్ని,రాజు,మురళి,కృష్ణ, బాలకృష్ణ,రాజేష్,మహేష్‌తో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు,మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News