Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 11, 2026 07:06 PM

పెద్దాయన కావూరి సాంబశివరావు కు అశ్రునివాళి

పెద్దాయన కావూరి సాంబశివరావు కు అశ్రునివాళి

 పెద్దాయన కావూరి సాంబశివరావు కు అశ్రునివాళి
March 11, 2026 05:46 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర కాబినెట్ మంత్రి కావూరి సాంబశివరావు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి అశ్రునివాళి అర్పిస్తున్నామని ఏలూరు జిల్లా ఎస్‌సి మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి తెలిపారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కావూరి సాంబశివరావు ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో దేశ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల మన్ననలు పొందారని తెలిపారు.

ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, పారిశ్రామిక రంగం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజల పట్ల నిబద్ధతతో ఎలా పని చేయాలో ఆయన తన జీవితంతో చూపించిన గొప్ప నాయకుడని కొనియాడారు.

కావూరి సాంబశివరావు గారి మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని పేర్కొంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News