Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:34 AM

పెద్దాయన కావూరి సాంబశివరావు కు అశ్రునివాళి

పెద్దాయన కావూరి సాంబశివరావు కు అశ్రునివాళి

 పెద్దాయన కావూరి సాంబశివరావు కు అశ్రునివాళి
11-03-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర కాబినెట్ మంత్రి కావూరి సాంబశివరావు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి అశ్రునివాళి అర్పిస్తున్నామని ఏలూరు జిల్లా ఎస్‌సి మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి తెలిపారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కావూరి సాంబశివరావు ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో దేశ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల మన్ననలు పొందారని తెలిపారు.

ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, పారిశ్రామిక రంగం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజల పట్ల నిబద్ధతతో ఎలా పని చేయాలో ఆయన తన జీవితంతో చూపించిన గొప్ప నాయకుడని కొనియాడారు.

కావూరి సాంబశివరావు గారి మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని పేర్కొంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Sthanikam

పెద్దాయన కావూరి సాంబశివరావు కు అశ్రునివాళి

Article Image

ఏలూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర కాబినెట్ మంత్రి కావూరి సాంబశివరావు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి అశ్రునివాళి అర్పిస్తున్నామని ఏలూరు జిల్లా ఎస్‌సి మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి తెలిపారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కావూరి సాంబశివరావు ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో దేశ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల మన్ననలు పొందారని తెలిపారు.

ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, పారిశ్రామిక రంగం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజల పట్ల నిబద్ధతతో ఎలా పని చేయాలో ఆయన తన జీవితంతో చూపించిన గొప్ప నాయకుడని కొనియాడారు.

కావూరి సాంబశివరావు గారి మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని పేర్కొంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News