Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

పెద్దకాపర్తిలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’కు ఊపు

పెద్దకాపర్తిలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’కు ఊపు

పెద్దకాపర్తిలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’కు ఊపు
March 15, 2026 02:03 PM 198 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్, ఘన సన్మానం

నమూనా గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు ఆదివారం ఊపునిచ్చారు. గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేకకార్యక్రమంలో గ్రామ పరిశుభ్రత, కార్మికుల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వారికి హెల్త్ చెకప్ నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి వెన్నెముకలుగా నిలిచే కార్మికులను సన్మానించి, సబ్బులు, కొబ్బరి నూనె, షాంపూ వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.కార్యక్రమంలో మాట్లాడిన సర్పంచ్ కాటం వెంకటేశం గ్రామం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటంలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని కొనియాడారు. గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దే లక్ష్యంతో 99 రోజుల ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పరిశుభ్రత కేవలం కార్మికుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి గ్రామస్థుడి బాధ్యత అని, “మన ఊరు – మన పరిశుభ్రత” భావనతో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు అర్పుల యాదయ్య, నీలకంఠం విజయ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నీలకంఠం లింగస్వామి, మర్రి గోపాల్ రెడ్డి, సాగర్ల నాగరాజు, అనగంటి నరేష్, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News