Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 07:10 PM

పెద్దబావి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దబావి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దబావి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
April 09, 2026 05:33 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు మండల పరిధిలోని పెద్దబావి (చాకంపల్లి) గ్రామానికి నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేసిన సందర్భంగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల సేవాదళ్ అధ్యక్షుడు, ఆలేరు యువజన కాంగ్రెస్ నాయకుడు జల్తార్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెద్దబావి గ్రామ రైతుల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి,వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయడం ద్వారా రైతుల ఇబ్బందులను తొలగించారని తెలిపారు. ఇందుకు ఆయన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి,ఉచిత కరెంట్,కొత్త రేషన్ కార్డులు,వడ్ల కొనుగోలు కేంద్రాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామంలో ఐకేపీ కేంద్రం లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి, అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవతో కేంద్రాన్ని మంజూరు చేయించారని తెలిపారు. ఈ విషయానికి సంబంధం లేని సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకులు తమకే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం సరికాదని విమర్శించారు. ఈ విషయం గ్రామస్తులకు కూడా తెలుసని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయని,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో పెద్దబావి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాకిటి మల్లారెడ్డి, సిద్ధులు యాదవ్,సత్తిరెడ్డి,చంద్రారెడ్డి,శ్రీను,రామ్,తిరుమలరెడ్డి,రమేష్,యాదిరెడ్డి,ప్రశాంత్ యాదవ్ తదితర గ్రామ నాయకులు,రైతులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News