Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

పెద్దబావి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దబావి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దబావి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
April 09, 2026 05:33 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు మండల పరిధిలోని పెద్దబావి (చాకంపల్లి) గ్రామానికి నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేసిన సందర్భంగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల సేవాదళ్ అధ్యక్షుడు, ఆలేరు యువజన కాంగ్రెస్ నాయకుడు జల్తార్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెద్దబావి గ్రామ రైతుల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి,వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయడం ద్వారా రైతుల ఇబ్బందులను తొలగించారని తెలిపారు. ఇందుకు ఆయన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి,ఉచిత కరెంట్,కొత్త రేషన్ కార్డులు,వడ్ల కొనుగోలు కేంద్రాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామంలో ఐకేపీ కేంద్రం లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి, అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవతో కేంద్రాన్ని మంజూరు చేయించారని తెలిపారు. ఈ విషయానికి సంబంధం లేని సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకులు తమకే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం సరికాదని విమర్శించారు. ఈ విషయం గ్రామస్తులకు కూడా తెలుసని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయని,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో పెద్దబావి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాకిటి మల్లారెడ్డి, సిద్ధులు యాదవ్,సత్తిరెడ్డి,చంద్రారెడ్డి,శ్రీను,రామ్,తిరుమలరెడ్డి,రమేష్,యాదిరెడ్డి,ప్రశాంత్ యాదవ్ తదితర గ్రామ నాయకులు,రైతులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News