Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:34 PM

పెద్ద కాపర్తిలో తిరుమనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల స్థాపన ఘనంగా

పెద్ద కాపర్తిలో తిరుమనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల స్థాపన ఘనంగా

 పెద్ద కాపర్తిలో తిరుమనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల స్థాపన ఘనంగా
February 18, 2026 06:20 PM 184 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలోని పెద్ద కాపర్తి లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ భూ సమేత తిరుమనాథ స్వామి దేవాలయం లో శంకు–చక్రాల స్థాపన కార్యక్రమం మరియు హోమం వైభవంగా నిర్వహించారు. ఈ ధార్మిక కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

శంకు–చక్రాల దాతగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పద్మ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హోమ కార్యక్రమంలో గుడి చైర్మన్ ఒరుసు రాజకుమార్ దంపతులు భక్తిశ్రద్ధలతో హాజరై సేవలు అందించారు.

అలాగే ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల బిక్షం భాను, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే రాములు యాదమ్మ, తాళ్ల వెల్లంల సర్పంచ్ జోగు సురేష్, మాజీ ముద్దసాని నీత రమణారెడ్డి, ఉప సర్పంచ్ ఓరుసు సైదులు, డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, చలమల్ల మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, వార్డు సభ్యులు ఏర్పులకూరు యాదయ్య, సాగర్ల నవ్య, శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, జిల్లా ప్రశాంత్, ఏదుల అజిత్ రెడ్డి, తెలుసూరి సైదులు, నూతి వెంకటేశం, డాక్టర్ కిరణ్ తదితర నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా శంకు–చక్రాల ప్రతిష్ఠాపన జరిగి, అనంతరం మహాప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో దేవాలయ మహోత్సవ వాతావరణం నెలకొంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెంపొందాలని పలువురు ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News