Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:54 PM

పెద్ద కాపర్తిలో తిరుమనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల స్థాపన ఘనంగా

పెద్ద కాపర్తిలో తిరుమనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల స్థాపన ఘనంగా

 పెద్ద కాపర్తిలో తిరుమనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల స్థాపన ఘనంగా
February 18, 2026 06:20 PM 180 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలోని పెద్ద కాపర్తి లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ భూ సమేత తిరుమనాథ స్వామి దేవాలయం లో శంకు–చక్రాల స్థాపన కార్యక్రమం మరియు హోమం వైభవంగా నిర్వహించారు. ఈ ధార్మిక కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

శంకు–చక్రాల దాతగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పద్మ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హోమ కార్యక్రమంలో గుడి చైర్మన్ ఒరుసు రాజకుమార్ దంపతులు భక్తిశ్రద్ధలతో హాజరై సేవలు అందించారు.

అలాగే ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల బిక్షం భాను, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే రాములు యాదమ్మ, తాళ్ల వెల్లంల సర్పంచ్ జోగు సురేష్, మాజీ ముద్దసాని నీత రమణారెడ్డి, ఉప సర్పంచ్ ఓరుసు సైదులు, డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, చలమల్ల మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, వార్డు సభ్యులు ఏర్పులకూరు యాదయ్య, సాగర్ల నవ్య, శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, జిల్లా ప్రశాంత్, ఏదుల అజిత్ రెడ్డి, తెలుసూరి సైదులు, నూతి వెంకటేశం, డాక్టర్ కిరణ్ తదితర నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా శంకు–చక్రాల ప్రతిష్ఠాపన జరిగి, అనంతరం మహాప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో దేవాలయ మహోత్సవ వాతావరణం నెలకొంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెంపొందాలని పలువురు ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News