పెద్ద కాపర్తిలో తిరుమనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల స్థాపన ఘనంగా
పెద్ద కాపర్తిలో తిరుమనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల స్థాపన ఘనంగా
Komidala Mahender reddy
చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలోని పెద్ద కాపర్తి లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ భూ సమేత తిరుమనాథ స్వామి దేవాలయం లో శంకు–చక్రాల స్థాపన కార్యక్రమం మరియు హోమం వైభవంగా నిర్వహించారు. ఈ ధార్మిక కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
శంకు–చక్రాల దాతగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పద్మ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హోమ కార్యక్రమంలో గుడి చైర్మన్ ఒరుసు రాజకుమార్ దంపతులు భక్తిశ్రద్ధలతో హాజరై సేవలు అందించారు.
అలాగే ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల బిక్షం భాను, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే రాములు యాదమ్మ, తాళ్ల వెల్లంల సర్పంచ్ జోగు సురేష్, మాజీ ముద్దసాని నీత రమణారెడ్డి, ఉప సర్పంచ్ ఓరుసు సైదులు, డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, చలమల్ల మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, వార్డు సభ్యులు ఏర్పులకూరు యాదయ్య, సాగర్ల నవ్య, శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, జిల్లా ప్రశాంత్, ఏదుల అజిత్ రెడ్డి, తెలుసూరి సైదులు, నూతి వెంకటేశం, డాక్టర్ కిరణ్ తదితర నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా శంకు–చక్రాల ప్రతిష్ఠాపన జరిగి, అనంతరం మహాప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో దేవాలయ మహోత్సవ వాతావరణం నెలకొంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెంపొందాలని పలువురు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి