Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:11 AM

పెద్ద కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీల బహుకరణ

పెద్ద కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీల బహుకరణ

పెద్ద కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీల బహుకరణ
February 06, 2026 09:40 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నలగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల లోటును గమనించిన గ్రామానికి చెందిన దాత కామినేని దుర్గాకుమార్ విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చారు. పాఠశాలలో బెంచీలు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం సుమారు నాలుగున్నర లక్షల రూపాయల విలువ గల 68 డ్యూయల్ డెస్క్ బెంచీలను ఆయన స్వంత ఖర్చుతో పాఠశాలకు బహుకరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీఠం శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం దాతకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి దాతల సహకారం ఎంతో కీలకమని అన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే విద్యార్థులకు అనుకూల వాతావరణంలో నాణ్యమైన విద్య అందించవచ్చని పేర్కొన్నారు. సమాజంలోని దాతలు ఇలాగే ముందుకు వచ్చి పాఠశాలలకు సహకరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేష్, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచ్ కందిమల్ల శిశుపాల్ రెడ్డి, స్టేజ్ దాతలు ఎర్పుల నరసింహ, అజిత్ రెడ్డి, నీలకంఠ నరేష్, నీలకంఠం లింగస్వామి, ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి, చేకూరి గణేష్, గంట్ల తిరుమల్ రెడ్డి, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బచ్చు లుకేందర్ రెడ్డి, సాగర్ల నాగరాజు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News