పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం; ఎమ్మెల్యే సామెల్
పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం; ఎమ్మెల్యే సామెల్
Bandi Kiran Kumar
ఆడపడుచులకు వరం కల్యాణ లక్ష్మి అని తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సంగేమ్ గ్రామానికి చెందిన ఉప్పుల మల్లమ్మ, కాకులారపు లక్ష్మి కళ్యాణ లక్ష్మి చెక్కులను రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్ తో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు.
కల్యాణ లక్ష్మిపేదింటి ఆడ పిల్లలుకు ఆర్థికంగా ఆదుకుంటుందని అన్నారు. మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి న ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బిజెపి, బీ ఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్, పార్టీ నాయకులు దేశం వల్ల బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి