Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:51 PM

పేద కుటుంబానికి సొంత ఇంటి సంతోషం – గృహప్రవేశంలో పాల్గొన్న పీసీసీ కే శ్రీనివాస్

పేద కుటుంబానికి సొంత ఇంటి సంతోషం – గృహప్రవేశంలో పాల్గొన్న పీసీసీ కే శ్రీనివాస్

పేద కుటుంబానికి సొంత ఇంటి సంతోషం – గృహప్రవేశంలో పాల్గొన్న పీసీసీ కే శ్రీనివాస్
February 20, 2026 12:34 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలంలోని తూర్కపల్లి గ్రామానికి చెందిన కమ్మరి లక్ష్మయ్యకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశం కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ సభ్యుడు కే శ్రీనివాస్ హాజరై కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కలగాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం అందేలా కట్టుబడి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.పేద ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటానికి గృహం ఎంతో ప్రధానమని,సొంత ఇల్లు కలగడం ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన విషయం అని అన్నారు.ఇందిరమ్మ గృహ పథకం ద్వారా అనేక కుటుంబాలు సురక్షితమైన నివాసాన్ని పొందుతున్నాయని,గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి ఇది ఒక కీలక అడుగు అని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో శివకుమార్, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, మహిళలు, యువకులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మయ్య కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆనందకర వాతావరణంలో ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News