Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:12 PM

పేద కుటుంబానికి సొంత ఇంటి సంతోషం – గృహప్రవేశంలో పాల్గొన్న పీసీసీ కే శ్రీనివాస్

పేద కుటుంబానికి సొంత ఇంటి సంతోషం – గృహప్రవేశంలో పాల్గొన్న పీసీసీ కే శ్రీనివాస్

పేద కుటుంబానికి సొంత ఇంటి సంతోషం – గృహప్రవేశంలో పాల్గొన్న పీసీసీ కే శ్రీనివాస్
February 20, 2026 12:34 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలంలోని తూర్కపల్లి గ్రామానికి చెందిన కమ్మరి లక్ష్మయ్యకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశం కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ సభ్యుడు కే శ్రీనివాస్ హాజరై కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కలగాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం అందేలా కట్టుబడి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.పేద ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటానికి గృహం ఎంతో ప్రధానమని,సొంత ఇల్లు కలగడం ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన విషయం అని అన్నారు.ఇందిరమ్మ గృహ పథకం ద్వారా అనేక కుటుంబాలు సురక్షితమైన నివాసాన్ని పొందుతున్నాయని,గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి ఇది ఒక కీలక అడుగు అని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో శివకుమార్, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, మహిళలు, యువకులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మయ్య కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆనందకర వాతావరణంలో ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News