-ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు
పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా,ప్రభుత్వ పాఠశాలలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు తీవ్రంగా డిమాండ్ చేశారు.శనివారం రోజు భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు మాట్లాడుతూ...ప్రవచనాల పేరుతో పిల్లలపై అసభ్యంగా,అవమానకరంగా మాట్లాడిన గరికపాటి వ్యాఖ్యలు పూర్తిగా అమానవీయమైనవని,ముఖ్యంగా విద్యార్థులను “శోభనం పెళ్లికొడుకు”తో పోల్చడం అనేది విద్యార్థి లోకాన్ని అవమానించడమేనని పేర్కొంది. పేద పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని చెప్పడం వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని విమర్శించింది.దేశవ్యాప్తంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు పెరగడానికి,డ్రాపౌట్ తగ్గించడానికి,పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తున్నదని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.స్వయంగా సుప్రీంకోర్టు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.అలాంటి పథకాన్ని అవహేళన చేస్తూ.. మాట్లాడటం గరికపాటి అజ్ఞానాన్ని,బాధ్యతారాహిత్యాన్నిబయటపెడుతుందని పేర్కొంది.దేశంలో సుమారు 84శాతం మంది తల్లులు,పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న సమయంలో,విద్యార్థులకు అందించే గుడ్డును “గాడిద గుడ్డు”గా వ్యాఖ్యానించడం ఆకలిని,పేదరికాన్ని కించపరచడమేనని తీవ్రంగా ఖండించింది. విద్యార్థులకు ఉచిత భోజనం,పుస్తకాలు,యూనిఫాంలు అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని,దానిని “బిచ్చం”గా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించింది.కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే లక్షల కోట్ల రాయితీలపై ఎప్పుడూ స్పందించని గరికపాటి,పేద పిల్లలకు అందించే భోజనంపై విషం కక్కడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి