Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:32 PM

పేద విద్యార్థులను కించపరిచిన గరికపాటి పై తక్షణ చర్యలు తీసుకోవాలి

పేద విద్యార్థులను కించపరిచిన గరికపాటి పై తక్షణ చర్యలు తీసుకోవాలి

పేద విద్యార్థులను కించపరిచిన గరికపాటి పై తక్షణ చర్యలు తీసుకోవాలి
21-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు

పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా,ప్రభుత్వ పాఠశాలలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు తీవ్రంగా డిమాండ్ చేశారు.శనివారం రోజు భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు మాట్లాడుతూ...ప్రవచనాల పేరుతో పిల్లలపై అసభ్యంగా,అవమానకరంగా మాట్లాడిన గరికపాటి వ్యాఖ్యలు పూర్తిగా అమానవీయమైనవని,ముఖ్యంగా విద్యార్థులను “శోభనం పెళ్లికొడుకు”తో పోల్చడం అనేది విద్యార్థి లోకాన్ని అవమానించడమేనని పేర్కొంది. పేద పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని చెప్పడం వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని విమర్శించింది.దేశవ్యాప్తంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు పెరగడానికి,డ్రాపౌట్ తగ్గించడానికి,పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తున్నదని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.స్వయంగా సుప్రీంకోర్టు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.అలాంటి పథకాన్ని అవహేళన చేస్తూ.. మాట్లాడటం గరికపాటి అజ్ఞానాన్ని,బాధ్యతారాహిత్యాన్నిబయటపెడుతుందని పేర్కొంది.దేశంలో సుమారు 84శాతం మంది తల్లులు,పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న సమయంలో,విద్యార్థులకు అందించే గుడ్డును “గాడిద గుడ్డు”గా వ్యాఖ్యానించడం ఆకలిని,పేదరికాన్ని కించపరచడమేనని తీవ్రంగా ఖండించింది. విద్యార్థులకు ఉచిత భోజనం,పుస్తకాలు,యూనిఫాంలు అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని,దానిని “బిచ్చం”గా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించింది.కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే లక్షల కోట్ల రాయితీలపై ఎప్పుడూ స్పందించని గరికపాటి,పేద పిల్లలకు అందించే భోజనంపై విషం కక్కడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తుంది.

Sthanikam

పేద విద్యార్థులను కించపరిచిన గరికపాటి పై తక్షణ చర్యలు తీసుకోవాలి

Article Image

-ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు

పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా,ప్రభుత్వ పాఠశాలలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు తీవ్రంగా డిమాండ్ చేశారు.శనివారం రోజు భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు మాట్లాడుతూ...ప్రవచనాల పేరుతో పిల్లలపై అసభ్యంగా,అవమానకరంగా మాట్లాడిన గరికపాటి వ్యాఖ్యలు పూర్తిగా అమానవీయమైనవని,ముఖ్యంగా విద్యార్థులను “శోభనం పెళ్లికొడుకు”తో పోల్చడం అనేది విద్యార్థి లోకాన్ని అవమానించడమేనని పేర్కొంది. పేద పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని చెప్పడం వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని విమర్శించింది.దేశవ్యాప్తంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు పెరగడానికి,డ్రాపౌట్ తగ్గించడానికి,పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తున్నదని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.స్వయంగా సుప్రీంకోర్టు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.అలాంటి పథకాన్ని అవహేళన చేస్తూ.. మాట్లాడటం గరికపాటి అజ్ఞానాన్ని,బాధ్యతారాహిత్యాన్నిబయటపెడుతుందని పేర్కొంది.దేశంలో సుమారు 84శాతం మంది తల్లులు,పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న సమయంలో,విద్యార్థులకు అందించే గుడ్డును “గాడిద గుడ్డు”గా వ్యాఖ్యానించడం ఆకలిని,పేదరికాన్ని కించపరచడమేనని తీవ్రంగా ఖండించింది. విద్యార్థులకు ఉచిత భోజనం,పుస్తకాలు,యూనిఫాంలు అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని,దానిని “బిచ్చం”గా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించింది.కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే లక్షల కోట్ల రాయితీలపై ఎప్పుడూ స్పందించని గరికపాటి,పేద పిల్లలకు అందించే భోజనంపై విషం కక్కడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News