Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:49 AM

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన
10-03-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మారక్సిస్ట్) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు హరి మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.115 పెంచడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ పై యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ దాడులు, అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు వంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమన్నారు.

ఇప్పటికే కరెంట్ చార్జీలు, నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ ధరలు పెంచడం ప్రజలపై మోయలేని భారమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉగాది , రంజాన్ పండగల సమయంలో ప్రజలపై ఈ భారాన్ని మోపడం అన్యాయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, బాబావాలి, గంగాధర్, వెంకట్రాముడు, హనుమంతు, శివ, ఓబులేసు, వలి, బాబు తదితరులు పాల్గొన్నారు


Sthanikam

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మారక్సిస్ట్) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు హరి మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.115 పెంచడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ పై యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ దాడులు, అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు వంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమన్నారు.

ఇప్పటికే కరెంట్ చార్జీలు, నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ ధరలు పెంచడం ప్రజలపై మోయలేని భారమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉగాది , రంజాన్ పండగల సమయంలో ప్రజలపై ఈ భారాన్ని మోపడం అన్యాయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, బాబావాలి, గంగాధర్, వెంకట్రాముడు, హనుమంతు, శివ, ఓబులేసు, వలి, బాబు తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News