పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మారక్సిస్ట్) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు హరి మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.115 పెంచడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ పై యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ దాడులు, అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు వంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమన్నారు.
ఇప్పటికే కరెంట్ చార్జీలు, నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ ధరలు పెంచడం ప్రజలపై మోయలేని భారమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉగాది , రంజాన్ పండగల సమయంలో ప్రజలపై ఈ భారాన్ని మోపడం అన్యాయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, బాబావాలి, గంగాధర్, వెంకట్రాముడు, హనుమంతు, శివ, ఓబులేసు, వలి, బాబు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి