Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:14 PM

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన
March 10, 2026 03:27 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మారక్సిస్ట్) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు హరి మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.115 పెంచడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ పై యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ దాడులు, అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు వంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమన్నారు.

ఇప్పటికే కరెంట్ చార్జీలు, నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ ధరలు పెంచడం ప్రజలపై మోయలేని భారమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉగాది , రంజాన్ పండగల సమయంలో ప్రజలపై ఈ భారాన్ని మోపడం అన్యాయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, బాబావాలి, గంగాధర్, వెంకట్రాముడు, హనుమంతు, శివ, ఓబులేసు, వలి, బాబు తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News