Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:46 AM

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: చిత్తూరులో రాస్తారోకో

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: చిత్తూరులో రాస్తారోకో

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: చిత్తూరులో  రాస్తారోకో
March 10, 2026 10:16 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


చాట్రాయి: నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలను రూ.60 వరకు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా గ్యాస్ ధరలు పెంచుతున్నా కూటమి పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు.

చిత్తపూరు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని త్వరలో కలవనున్నట్లు చాట్రాయి మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, భవాని, కొత్తపల్లి ప్రసాద్, సోమేశ్వరరావు, పుల్లారావు, నారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News