పోలింగ్ స్లిప్పుల వ్యవహారంపై అధికారులపై వేటు
పోలింగ్ స్లిప్పుల వ్యవహారంపై అధికారులపై వేటు
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ స్లిప్పులు డ్రైనేజీలో పడివున్న ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనపై నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల విధుల్లో ఘోర నిర్లక్ష్యం వహించారంటూ చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆమెతో పాటు మరో పది మంది పోలింగ్ అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పవిత్రతకు భంగం కలిగేలా జరిగిన ఈ ఘటనను కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. పోలింగ్ స్లిప్పులు డ్రైనేజీలో కనిపించడంపై విచారణ చేపట్టిన జిల్లా యంత్రాంగం, బాధ్యతారాహిత్యమే ఇందుకు కారణమని నిర్ధారించింది. ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం దెబ్బతినే చర్యలను సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.
మొత్తానికి చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లు–పోలింగ్ స్లిప్పుల వ్యవహారం అధికారులకు పెద్ద షాక్గా మారింది. ‘వార్త ఎఫెక్ట్’తో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు దిగడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల విధుల్లో పారదర్శకత, బాధ్యత తప్పనిసరిగా ఉండాలన్న సందేశాన్ని ఈ సస్పెన్షన్లు స్పష్టంగా ఇచ్చాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి