PRINT TIME: April 10, 2026 04:10 PM
పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు
పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు
February 22, 2026 03:06 PM
14 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
జామియా మజీద్లో నాలుగవ రోజా – ఉపవాసదారులకు ప్రత్యేక భోజనాలు
శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని జామియా మజీద్ లో ముస్లిం మైనారిటీ సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహించారు.
ఉపవాసదారులు ముందుగా వజు (మొహం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోవడం) చేసి మజీద్లో ప్రత్యేక దువా చేశారు. అనంతరం రంజాన్ మాసంలోని నాలుగవ ఉపవాస దీక్ష (రోజా)ను ఆచరించారు.
ఉపవాసదారుల కోసం జామియా మజీద్ కమిటీ సభ్యులు ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న చికెన్ షాప్ నిర్వాహకుడు అబ్దుల్లా అన్నం, పప్పు, రాగి ముద్ద, చికెన్ కర్రీ వండి ముస్లిం మైనారిటీ సోదరులకు వడ్డించారు. ఈ సందర్భంగా సోదరభావం, ఐక్యత స్పష్టంగా కనిపించింది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి