పాతికేళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు
పాతికేళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు
K.RAVI
మండల పరిధి లింగోజీగూడెం చికోటి విజయలక్ష్మి పంక్షన్ హల్ లో పంతంగి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను, పాఠశాల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పంతంగి జడ్పి పాఠశాలలో 25 ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఓకేచోటకు చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఆనాటి గురువులు ఆంజనేయులు, సంజీవ రెడ్డి,దైవాదినం, కోటిరెడ్డి, రమణ రెడ్డి, బిక్కు, పాపయ్య, సత్యనారాయణ లను సత్కరించి జ్ఞాపికాలను అందజేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు గరిసే ఐలయ్య, బద్దం రమేష్, నిర్మల, శిల్ప, శారద, మాధగోని శంకర్, మాధవి, కడగంచి నగేష్, మధుసూదన్,బాతరాజు గురుమూర్తి, సంధ్యరాణి, బోయ సంతోష, ఉయ్యాల గణేష్, బోయ సుధాకర్ 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి